TRS Corporator Vijaya Reddy: తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ కు దివంగత మాజీ మంత్రి పి జనార్థన్ రెడ్డి (పీజేఆర్) తనయ విజయారెడ్డి షాక్ ఇచ్చారు. ఖైరతాబాద్ డివిజన్ నుండి టిఆర్ఎస్ కార్పోరేటర్ గా ఉన్న విజయారెడ్డి టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఆమె తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పారు. టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం పార్టీ మార్పు నిర్ణయాన్ని విజయారెడ్డి వెల్లడించారు. ఈ నెల 23వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు విజయారెడ్డి, మంచి భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాననీ, పీజేఆర్ వారసత్వం కొనసాగించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం ఇంటిపార్టీలోకి వస్తున్నానన్న భవన ఉందని అన్నారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
పీజేఆర్ వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన విజయారెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. రెండు పర్యాయాలు కార్పోరేటర్ గా గెలిచారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ పదవిని ఆశించారు. కానీ ఆమెకు అవకాశం దక్కలేదు. టీఆర్ఎస్ లో తనకు సరైన గుర్తింపు, గౌరవం లభించడం లేదని కొంత కాలంగా విజయారెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. ఈ తరుణంలో తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయాన్ని ప్రకటించారు.