Race Gurram: 2014వ సంవత్సరంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరోగా నటించిన “రేసుగుర్రం”( Race Gurram) బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. వైవిధ్యమైన స్టోరీతో.. కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన శృతిహాసన్(Shruti Hassan) హీరోయిన్ గా చేసింది. సినిమాలో సెకండ్ హాఫ్ లో బ్రహ్మానందం(Brahmanandam) ఎంట్రీ అయ్యాక… నెక్స్ట్ లెవెల్ తరహాలో కామెడీ ఉంటది. అల్లు అర్జున్ కెరీర్(Allu Arjun) లోనే అత్యధిక వసూలు సాధించిన సినిమాలలో “రేసుగుర్రం” ఒకటి. అయితే ఇప్పుడు మరోసారి “రేసుగుర్రం” కాంబినేషన్ రిపీట్ కానున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
విషయంలోకి వెళ్తే ఇటీవల డైరెక్టర్ సురేందర్ రెడ్డి… బన్నీకి స్క్రిప్ట్ వినిపించడం జరిగిందంట. చాలా బాగా నచ్చినట్లు చివరిలో కొద్దిగా మార్పులు.. చేయాలని బన్నీ సూచించినట్లు.. సమాచారం. అంతా ఓకే అయితే స్క్రిప్ట్ కుదిరితే త్వరలో ఈ కాంబినేషన్ పట్టాలెక్కనున్నట్లు అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” రెండవ భాగం చేయడానికి రెడీ అవుతున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.
“పుష్ప” మొదటి భాగం సూపర్ డూపర్ హిట్ కావడంతో.. పాటు ప్రపంచవ్యాప్తంగా “పుష్ప” డైలాగులు మేనరిజం.. వైరల్ కావడంతో అంతకుమించి అన్నతరహాలో.. రెండో భాగం విషయంలో సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాదు “పుష్ప” మొదటి భాగం రిలీజ్ అయిన భాషల కంటే అధికంగా రెండవ భాగం విడుదల కానున్నట్లు సమాచారం. ఇక ఇదే సమయంలో సురేందర్ రెడ్డి కూడా ప్రస్తుతం ఒప్పుకున్నా పవన్ కళ్యాణ్ సినిమా.. కంప్లీట్ చేశాకే..,స్క్రిప్ట్ ఓకే అయితే బన్నీ సినిమా స్టార్ట్ చేయనున్నట్లు టాక్.