దర్శక ధీరుడు రాజమౌళి పేరు ఇప్పుడు దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో మారుమ్రోగుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి టేకింగ్ కి ప్రపంచ స్థాయి సినీ ప్రేమికులు ఫిదా అయిపోతున్నారు. ఒకప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ గురించి మాట్లాడుకునే సినీ ప్రపంచం ఇప్పుడు రాజమౌళి గురించి మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది. “బాహుబలి 2”, “RRR” లతో ఒక్కసారిగా ప్రపంచదృష్టిని తన వైపు మల్లెల చేసుకున్నడు జక్కన్న. ముఖ్యంగా ఇటీవల విడుదలైన “RRR” ఓటీటీలో సినీ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంది. ఈ సినిమాను చూసి రాజమౌళి టేకింగ్ కి హాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియాలో పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
థియేటర్ నుండి బయటకి వచ్చేసినా “RRR” మేనియా ఇంకా కొనసాగుతూ ఉంది. ఇటువంటి తరుణంలో హాలీవుడ్ ఇండస్ట్రీ ఎంతో ప్రముఖంగా నిర్వహించే టొరాంటో ఫిలిం ఫెస్టివల్ 2022కి ఇండియాలో ఒక్క రాజమౌళికి మాత్రమేఆహ్వానం పంపించడం జరిగింది. హాలీవుడ్ ఇండస్ట్రీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్-2022(టీఫ్)లో రాజమౌళి భాగం కానున్నారు. ఈ విషయాన్ని స్వయంగా టీఫ్ అధికారికంగా ప్రకటించింది. హాలీవుడ్ ప్రముఖలతో కలిసి ఈ ఏడాది టీప్ వేడుకలో ఆయన చర్చావేదికలో పాల్గొననున్నారు. సెప్టెంబర్ 8 నుంచి 18 వరకు ఈ చిత్రోత్సవాలు జరగనున్నాయి.
హాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ దర్శకులు మరియు టెక్నీషియన్ లు… హీరో హీరోయిన్ లు.. ఈ వేడుకకు హాజరు కానున్నారు. వారందరితోపాటు మన దేశ దిగ్గజ దర్శకుడు రాజమౌళి కూడా అంతర్జాతీయంగా ఎంతో పేరుగాంచిన టొరెంటో ఫిలిం ఫెస్టివల్ కి ఆహ్వానం అందడం చాలా సంతోషించదగ్గ విషయం. ఇదిలా ఉంటే “RRR” తర్వాత మహేష్ తో రాజమౌళి సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పనుల్లో ప్రస్తుతం జక్కన్న ఫుల్ బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది ప్రారంభం నుండి ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన తోపాటు రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!