RRR: “ఆర్ఆర్ఆర్” ప్రీ రిలీజ్ వేడుక కర్ణాటకలో జరిగింది. ఈ వేడుకకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన స్పీచ్ ఇస్తున్న సమయంలో ఒక్క సారిగా ఒక వ్యక్తి స్టేజి పైకి తీసుకురావడం తో పక్కనే ఉన్న డైరెక్టర్ రాజమౌళి ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. స్టేజిపైన పోలీసులు తప్ప మిగతా బాడీగార్డులు…బౌన్సర్ లు అంతా దిగిపోవాలని గట్టి గట్టిగా అరిచారు. అంత మాత్రమే కాక స్టేజిపై డాన్సర్ లు కూడా ఉండకూడదని .. పోలీసుల తప్ప మిగతా వాళ్ళు ఎవరు స్టేజిపై ఉండకూడదని రాజమౌళి స్వయంగా స్టేజి మొత్తాని ఖాళీ చేయించారు.
దూసుకొచ్చిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని…తరలించారు. ఈ తరుణంలో కర్ణాటక ముఖ్యమంత్రి ఒక్కసారిగా స్పీచ్ ఆపేయటం జరిగింది. అనంతరం ప్రసంగిస్తూ… రాజమౌళి తమ ఊరని..రాయచూర్ అని స్పష్టం చేశారు. అదే విధంగా, సినిమాలో హీరో ఎన్టీయార్ కూడా కర్ణాటకతో అనుబంధం ఉన్నవాడేనని చేపుకొచ్చారు. ఇక, రామ్ చరణ్ తండ్రి చిరంజీవి కర్ణాటకలో కూడా మెగాస్టార్ అని.. సినిమాలో తనకు ఆకట్టుకున్న అంశం స్వాతంత్ర పోరాటం అని చెప్పుకొచ్చారు.
బ్రిటీష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన తొలితరం వారిలో కన్నడ గడ్డకు చెందిన కిత్తూరు రాణి చెన్నమ్మ మొదటి మహిళ అని సీఎం బసవరాజ్ బొమ్మై చరిత్రను గుర్తు చేశారు. దీంతో దర్శకుడు రాజమౌళి స్వాతంత్ర్య సమరయోధుల అంశాన్ని ప్రస్తావిస్తూ సినిమా చిత్రీకరించడాన్ని ప్రశాంసిస్తున్నానని తెలిపారు. ఏది ఏమైనా చాలా ప్రశాంతంగా కనబడే రాజమౌళి ఒక్కసారిగా అది ముఖ్యమంత్రి ముందు… స్టేజి పై సీరియస్ అవ్వటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. రాజమౌళి అరుపులకు స్టేజి పైనే ఉన్న ఎన్టీఆర్ మరియు చరణ్ షాక్ అయిపోయారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!