RRR: “RRR” సినిమా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అనేక సంచలనాలు సృష్టించటం తెలిసిందే. మార్చి నెలలో విడుదలైన ఈ సినిమా ఏకంగా రూ1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. “బాహుబలి” తీసిన దర్శకుడు కావడంతో “RRR”కి దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రాజమౌళి టేకింగ్ చరణ్, తారక్ పెర్ఫార్మెన్స్ కి అందరూ ఫిదా అయ్యారు. అయితే సినిమా వచ్చిన ప్రారంభంలో ఎన్టీఆర్ ని తక్కువ చేసినట్లు చరణ్ నీ హైలెట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ అభిమానులు రాజమౌళి పై సీరియస్ అయినట్లు టాక్ వచ్చింది. అంతేకాకుండా తారక్ కి జక్కన్న కి మధ్య కూడా మనస్పర్ధలు వచ్చినట్లు ప్రచారం జరిగింది.
ఇటువంటి తరుణంలో తాజాగా రాజమౌళి యాంకర్ సుమ షోకి రావడం జరిగింది. ఈ సందర్భంగా “RRR”లో ఇద్దరు హీరోల ప్రాధాన్యత గురించి సుమ…రాజమౌళికి ప్రశ్నలు వేయడం జరిగింది. దీంతో “RRR” లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారన్న దానిపై రాజమౌళి స్పందిస్తూ..” ఏ ఒక్కరికో ఎక్కువ, తక్కువ న్యాయం చేస్తే సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదు. నేను సమన్యాయం చేశా.. అని క్లారిటీ ఇచ్చారు.
ఇక ఇదే సమయంలో విజయేంద్ర ప్రసాద్ ఇంకా కీరవాణి లేకుండా సినిమాలు చేసే అవకాశం ఉందా అని సుమా మరో ప్రశ్న వేసింది. దానికి రాజమౌళి జవాబు ఇస్తూ అది అసాధ్యమని అన్నారు. రాజమౌళి ఇప్పటివరకు చేసిన సినిమాలు అన్నిటికీ స్టోరీ అందించినది విజయేంద్ర ప్రసాద్ అయితే.. మ్యూజిక్ డైరెక్టర్ గా కీరవాణి వర్క్ చేయడం జరిగింది. కాగా ప్రస్తుతం రాజమౌళి నెక్స్ట్ చేయబోయే మహేష్ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పై వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సినిమా “RRR”, “బాహుబలి” కంటే భారీ ప్రాజెక్ట్ గా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు.