అమరావతి: ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ అనే సినిమాతో రాజకీయ, సినీరంగంలో సంచలనం సృష్టించిన సినీ దర్శకుడు రాం గోపాల్ వర్మ నేడు మరో సంచలన ప్రకటన చేశారు. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే సినిమాకు సీక్వెల్ తీయాలనే ఆలోచన వచ్చిందని ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. టిడిపికి రాజీనామా చేసిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇచ్చిన ఇంటర్వ్యూలు చూసిన తరువాత తనకు ఈ అలోచన వచ్చిందని తెలిపారు. ఈ సీక్వెల్కు ‘రెడ్డి రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్’ అనే టైటిల్ పెడతానని వర్మ ప్రకటించారు.
ఇప్పటికే ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సినిమా టైటిల్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. కులాల పేరుతో పెట్టే టైటిల్స్ విమర్శలకు దారి తీస్తాయని పలువురు పేర్కొంటున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!