Brahmastra: హీరో రణబీర్ కపూర్.. ఆలియా భట్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా “బ్రహ్మాస్త్ర”. అయన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ మాసంలో విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నాగార్జున కూడా నటించడం జరిగింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే తాజాగా ఈ సినిమా యూనిట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్టణంలో పర్యటించారు. “బ్రహ్మస్త్ర” సినిమా యూనిట్ తో పాటు ది గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి కూడా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. విశాఖపట్టణంలో ఓ ఈవెంట్ లో రణబీర్ కపూర్ తెలుగు చలన చిత్ర రంగం యొక్క గొప్పతనం గురించి చాటిచెప్పారు. ఇదే సమయంలో డైరెక్టర్ రాజమౌళి గొప్పదనాన్ని కూడా చాటారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో తన ఫేవరెట్ హీరో ప్రభాస్ అని రణబీర్ కపూర్ నిర్మొహమాటంగా చెప్పుకొచ్చాడు.
అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే కూడా ఇష్టం అని తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో రజినీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, ఎన్టీఆర్, రామ్ చరణ్ తనకెంతో ప్రియమైన మిత్రులని తెలిపారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించిన సమయంలో విశాఖపట్టణంలో ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. జూన్ 15వ తారీకు “బ్రహ్మాస్త్ర” థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాకి సంబంధించి ఫస్ట్ 20 నిమిషాలు స్టోరీ తనకు తెలుసని సినిమా గ్యారెంటీగా అందరినీ ఆకట్టుకుంటుందని రాజమౌళి ప్రమోషన్ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు.