Bheemla Naayak: “బీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ వేడుక నిన్న హైదరాబాదులో చాలా కోలాహలంగా జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత పవన్ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఇండస్ట్రీలో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సందడి వాతావరణం క్రియేట్ అయింది. మలయాళం సూపర్ డూపర్ హిట్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన “బీమ్లా నాయక్” ఫిబ్రవరి 25వ తారీఖు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో నిన్న ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ ప్రసంగం గురించి తాజాగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రియాక్ట్ అయ్యారు. “బీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పవన్ ప్రసంగం ఎంతో హుందాగా, అద్భుతంగా, మనసును హత్తుకునేలా, భావోద్వేగభరితంగా ఉందని ఆయన కితాబునిచ్చారు.
ఆయన ప్రవర్తన ఎంతో మర్యాదపూర్వకంగా ఉందని ఆర్జివి చెప్పారు. పవన్ ఫంక్షన్ లో మాట్లాడుతూ ఇండస్ట్రీకి రాజకీయాలతో సంబంధం ఉండదని, నటీనటులకు కులం మతం ప్రాంతం అనేది ఉండదని … ఇండస్ట్రీలో కళనే నమ్ముకున్న వాళ్ళు ఉంటారు అని తెలియజేశారు. అదే విధంగా చెన్నై నుండి ఇ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాదుకు ఇండస్ట్రీ రావడానికి చెన్నారెడ్డి ఇంకా చాలామంది పెద్దలు కృషి ఉందని తెలిపారు.
ఇక ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్ ఇండస్ట్రీస్ ఎదుగుదల కోసం ఎంతో సహకరిస్తున్నారని.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇండస్ట్రీ సమస్యలకు సంబంధించి చాలా త్వరగా స్పందిస్తున్నారని .. ఆయన సహకారం మరవలేనిది అంటూ కృతజ్ఞతలు తెలిపారు. దీంతో గతంలో ఓ సినిమా వేడుకలో పవన్ .. ఏపీలో అధికార పార్టీని టార్గెట్ చేసుకుని మీరు రెడ్డి…వాళ్ళు రెడ్డి అంటూ ఒక టాప్ నిర్మాతపై కామెంట్లు చేయడంతోపాటు.. ఇండస్ట్రీ వర్సెస్ ఏపీ అధికార పార్టీ అన్న తరహాలో ప్రసంగించారు కానీ ఇప్పుడు..”బీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ వేడుక లో… ఎక్కడా కూడా రాజకీయాలకు తావివ్వకుండా ఇండస్ట్రీకి రాజకీయాలతో సంబంధం లేదని పవన్ ప్రసంగించడం.. హైలెట్ గా మారింది. సినిమా బాగా రావడానికి డైరెక్టర్ త్రివిక్రమ్ కృషి మరువలేనిదని స్పష్టం చేశారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!