యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో త్వరలో సినిమా స్టార్ట్ కానున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరియర్ లో 30వ సినిమాగా తెరకేక్కుతున్న ఈ మూవీలో కీలక పాత్రలో మెగా హీరో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళ్తే ఎన్టీఆర్ బావమరిది పాత్రలో మెగా కాంపౌండ్ హీరో సాయిధరమ్ తేజ్ నీ తీసుకున్నే ఆలోచనలో కొరటాల శివ ఉన్నారట. సినిమాలో ఈ పాత్ర చాలా కీలకమని అందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అంతకుముందే ఎన్టీఆర్ “RRR” లో మెగా హీరో చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం తెలిసిందే. ఇద్దరు కూడా పోటాపోటీగా నువ్వా నేనా అన్నట్టుగా స్క్రీన్ మీద నటించారు. సినిమా సూపర్ డూపర్ హిట్ కావటంతో పాటు మెగా కాంపౌండ్ కుటుంబ సభ్యులు ఇద్దరు కూడా అన్నదమ్ములు మాదిరిగా ఉన్నారని వ్యాఖ్యానించడం విశేషం. పరిస్థితుల్లో ఉంటే ఇప్పుడు మరో మెగా హీరో సాయిధరమ్ తేజ్.. ఎన్టీఆర్ మూవీలో నటిస్తున్నట్లు వార్త రావటం ఇప్పుడు సంచలనంగా మారింది. మరి వస్తున్న ఈ వార్తకు సినిమా యూనిట్ క్లారిటీ ఇస్తే బాగుంటుంది. మరోపక్క సాయి ధరమ్ తేజ్.. పవన్ కళ్యాణ్ తో “వినోదయ సీతం” రీమేక్ లో నటిస్తున్నారు. త్వరలోనే సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. అంతేకాదు తన కొత్త సినిమా షూటింగ్ కూడా త్వరలో సాయిధరమ్ తేజ్ స్టార్ట్ చేయనున్నారు.
ఇదిలా ఉంటే కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య అట్టర్ ఫ్లాప్ కావడంతో.. ఎన్టీఆర్ అభిమానులు “NTR 30” ప్రాజెక్టు పై టెన్షన్ పడుతున్నారు. ముఖ్యంగా రాజమౌళి తో చేసాక ఎన్టీఆర్ నటించే సినిమాలు చాలావరకు ఫ్లాప్ కావడంతో… పైగా ఎన్టీఆర్ కెరియర్ లో ఇది 30వ సినిమా కావటంతో అభిమానులు ఏమవుతుందో అని ఆందోళన చెందుతున్నారు. అయితే వరుసగా భారీ బ్లాక్ బస్టర్ లు రావడం… ఆచార్య పరాజయం పాలు కావడంతో ఎన్టీఆర్ సినిమాని కొరటాల చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నరట.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!