Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన నటన ద్వారా ఇప్పటికే ఎన్నో రికార్డులను సృష్టించారు. రికార్డులు సృష్టించడం మహేష్ బాబుకు కొత్త ఏమి కాదు. మహేష్ బాబు సినిమా పాటలే కాకుండా, ట్రైలర్లు, పోస్టర్లు, టీజర్స్ గతంలో ఎన్నో రికార్డులు సృష్టించాయి. అయితే తాజాగా మహేష్ బాబు రికార్డుల లిస్టులోకి మరొకటి వచ్చి చేరింది.
గత ఏడాది సంక్రాంతి కానుకగ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన “సరిలేరు నీకెవ్వరు” సినిమాలో మహేష్ బాబు, రష్మిక సందడి చేశారు. గత ఏడాది విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. అదేవిధంగా ఈ సినిమాకు సంగీతం దేవిశ్రీప్రసాద్ ఎంతో అద్భుతంగా అందించారు. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలలో “మైండ్ బ్లాక్.. మైండ్ బ్లాక్” అనే పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ వీడియో పాట కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది అని చెప్పవచ్చు.
మహేష్ బాబు, సరిలేరు నీకెవ్వరు:
ఈ సినిమాలోని మైండ్ బ్లాక్ పాట తాజాగా 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. ఈ విధంగా 100 మిలియన్ల వ్యూస్ సాధించడంతో మహేష్ బాబు మరోసారి రికార్డ్ సృష్టించాడని చెప్పవచ్చు. ఈ పాట అంతగా ప్రేక్షకాదరణ పొందడానికి మహేష్ బాబు, రష్మిక పర్ఫామెన్స్ కూడా ఈ పాటకు ఇంత క్రేజ్ రావడానికి కారణమైందని చెప్పవచ్చు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు పరుశురామ్ దర్శకత్వంలో ” సర్కారీ వారి పాట” సినిమాలో చేస్తున్నారు.ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడిగా మహానటి కీర్తిసురేష్ నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్నట్లు చిత్రబృందం ప్రకటించారు. మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!