దివంగత శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. తల్లి వారసురాలుగా సినిమా ఎంట్రీ ఇచ్చిన జాన్వి కపూర్ వరుస పెట్టి అవకాశాలు అందుకుంటూ తల్లికి తగ్గ తనయురాలుగా మంచి క్రేజ్ సంపాదించుకోవడం జరిగింది. ఇక సోషల్ మీడియాలో జాహ్నవి కపూర్ పోస్ట్ చేసే ఫోటోలు ఎంతో లైకులు సాధిస్తాయి. తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇది ఇలా ఉంటే శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఎప్పుడు సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఎంట్రీస్తుందో అని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పట్లో రామ్ చరణ్ సరసన జాన్వికాపూర్ నటించడానికి రెడీ అయినట్లు వార్తలు వచ్చాయి.
“జగదేకవీరుడు అతిలోకసుందరి” సినిమా సీక్వెల్ తీయనున్నట్లు చరణ్, జాన్వి కపూర్ జంటగా నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ వచ్చిన వార్తలలో వాస్తవం లేదని తెలిపారు. ఇదిలా ఉంటే ఇటీవల ఎన్టీఆర్ 30వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో హీరోయిన్ పాత్రలో జాన్వి కపూర్ నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై తాజాగా జాన్వికపూర్ క్లారిటీ ఇచ్చింది. నేను దక్షిణాది సినిమా రంగంలో ముఖ్యంగా తెలుగులో ఏదైనా సినిమా చేయాలని అవకాశం కోసం ఎదురు చూస్తున్నా.
ఈ క్రమంలో ఎన్టీఆర్ తో కలిసి పని చేసే అవకాశం వస్తే.. చాలా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ఎన్టీఆర్ మంచి లెజెండ్. అయితే ఎన్టీఆర్ తో నటించే ఛాన్స్ ఎప్పటి వరకు రాలేదు. కానీ అవకాశం కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాను అని జాన్వి కపూర్ స్పష్టం చేయడం జరిగింది. దీంతో ఎన్టీఆర్ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ అన్న వార్తలలో వాస్తవం లేదని తేలిపోయింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!