శర్వానంద్కు కథ చెప్పి ఒప్పించడం అంటే తేలికైన విషయం కాదనే సంగతిని అదరికీ తెలిసిందే. అయితే ఓ యువ దర్శకుడు మాత్రం తొలి సిట్టింగ్లోనే శర్వానంద్తో ఓకే చేయించుకున్నాడట. ఇంతకు ఆ దర్శకుడు ఎవరో కాదు.. శ్రీరాం ఆదిత్య. `భలేమంచిరోజు`తో హిట్ సాధించిన ఈ డైరెక్టర్.. తర్వాత `శమంతకమణి`, `దేవదాస్` చిత్రాలను తెరకెక్కించాడు. ఈ రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి. అయితే రీసెంట్గా ఓ కథను శర్వానంద్కు వినిపించాడట. సాధారణంగా కథలను ఓకే చేయడానికి రెండు, మూడు సిట్టింగ్స్ తీసుకునే శర్వానంద్.. శ్రీరాంకు మాత్రం వినగానే ఎస్ చెప్పేశాడట. ప్రస్తుతం శర్వానంద్ సుధీర్ వర్మతో `రణరంగం`.. 96 రీమేక్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాలను పూర్తి చేసిన తర్వాతే శ్రీరాం ఆదిత్య సినిమా ఉంటుందని టాక్.
previous post
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!