2012వ సంవత్సరంలో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన “బిజినెస్ మాన్” సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కేవలం కొద్ది నెలలలోనే ఈ సినిమా తీసి అదిరిపోయే విజయాన్ని అందుకోవటం జరిగింది. మహేష్ బాబు హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్ పాత్ర పోషించారు. సినిమాలో మహేష్ బాబు చెప్పే డైలాగులు చాలా హైలెట్ గా ఉంటాయి. ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన పాటలు కూడా… సెన్సేషనల్ విజయం సాధించడం జరిగింది.
అయితే తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ చేయనున్నట్లు డైరెక్టర్ పూరి జగన్నాథ్ సంచలన ప్రకటన చేయడం జరిగింది. ‘లైగర్’ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. హిందీలో ఈ సినిమా సీక్వెల్ చేయనున్నట్టు నిర్మాతగా కరణ్ జోహార్ ఉండనున్నట్లు సమాచారం. మరి “బిజినెస్ మాన్” ఆఫర్ కరణ్ జోహార్ ఏ హీరోకి ఇస్తారో చూడాలి. “బిజినెస్ మాన్” మాత్రమే కాదు “పోకిరి” కూడా సీక్వెల్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్న సినిమా అని పూరి తెలిపారు.
అప్పట్లో మహేష్ బాబుతోనే సీక్వెల్ చేయడానికి ప్లాన్ చేసినట్లు కానీ.. మహేష్ వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో.. డ్రాప్ అయినట్లు తెలిపారు. ఏది ఏమైనా “బిజినెస్ మాన్” మాత్రం హిందీలో సీక్వెల్ చేయనున్నట్టు నిర్మాత పూరి చెప్పటం సంచలనంగా మారింది. హిందీలో అప్పట్లో “పోకిరి” సినిమాని “వాంటెడ్” గా రీమేక్ చేసి సల్మాన్ ఖాన్ భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. వరుస పరాజయాలలో కెరియర్ పరంగా బ్యాడ్ టైం నడుస్తున్న టైం లో.. సల్మాన్ ఖాన్ నీ “పోకిరి” ఆదుకోవడం జరిగింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!