ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మోడీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర విభజన తర్వాత అనేక అంశాలు పెండింగ్ లో ఉన్నాయి. విభజన చట్టంలోని ప్రత్యేక హోదాతో సహా అనేక హామీలు నెరవేరలేదు. తెలంగాణ నుండి రావాల్సిన బకాయిలు విడుదల కాలేదు. రాష్ట్రం తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో ఉంది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కారణంగా ప్రతి నెలా అప్పులు చేయాల్సి వస్తున్న సంగతి. ఏపి సీఎం వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్లిన ప్రతి సారి రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించి వీటిిని పరిష్కరించాలని వినతి పత్రాలను ఇచ్చి వస్తూ ఉన్నారు. తాజాగా రెండు రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీ ని సీఎం జగన్ కలిసి వచ్చారు. రాష్ట్రానికి సంబంధించి కీలక అంశాలపై చర్చించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో కేంద్రం నుండి కదలిక మొదలైంది.
ఏపి సమస్యల పరిష్కారంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఈ క్రమంలో భాగంగా ప్రధాన మంత్రి మోడీ ఆదేశాలతో ఏపి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రం. కేంద్ర ఆర్ధిక శాఖ కార్యదర్శి స్వామినాథన్ కమిటీ నేతృత్వంలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హజరు కావాలని ఏపి ప్రభుత్వానికి సమాచారం పంపింది. ఈ సమావేశానికి ఏపి ప్రభుత్వ ప్రతినిధుల బృందం హాజరు కానున్నది. ప్రతినిధుల బృందం చైర్మన్ గా వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి, వైస్ చైర్మన్ గా ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు వ్యవహరించనుండగా, పలు శాఖల అధికారులు ఈ సమావేశానికి హజరవ్వనున్నారు.
ఢిల్లీ పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమైన ఏపీ సీఎం వైఎస్ జగన్ .. కీలక ట్విస్ట్ ఏమిటంటే..?