THAMAN : మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియం’ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గుబాటి రానా కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఒక పోలీసు మరియు మిలటరీ ఆఫీసర్ కి మధ్య ఈగో వాతావరణంలో సినిమా స్టోరీ ఉంటుంది. భారీ యాక్షన్ డ్రామా తరహాలో సినిమాలో ఈ రెండు ప్రధాన పాత్రలు నువ్వానేనా అన్నట్టుగా తల పడుతూ ఉంటాయి.
దీంతో పవన్, రానా కలిసి నటిస్తున్న నేపథ్యంలో..ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తూ డైరెక్టర్ త్రివిక్రమ్ అదిరిపోయే స్క్రీన్ ప్లే ‘అయ్యప్పనుమ్ కోషియం’ సినిమాలో సెట్ చేయడం జరిగిందని తమన్ పొగడ్తల వర్షం కురిపించారు. రెండు పాత్రలకి ఇంపార్టెన్స్ ఇవ్వటం మరియు తెలుగు నేటివిటీకి దగ్గరగా స్క్రిప్ట్ ఉండేలా చూసుకోవటం లో క్యారెక్టర్ డిజైన్ చేయడంలో.. త్రివిక్రమ్ పనితనం బాగుందని పొగడ్తల వర్షం కురిపించారు.
ఖచ్చితంగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ హిట్ గ్యారెంటీ అని తెలిపారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మూడు పాటలు ఉండగా అవన్నీ ఇటీవల కంప్లీట్ చేయటం జరిగినట్లు తెలిపాడు. సినిమాకి స్క్రీన్ ప్లే మాత్రమేకాక డైలాగ్స్ కూడా అందించాడు త్రివిక్రమ్. సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన నిత్య మీనన్ హీరోయిన్ గా చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఈ ఒక్క సినిమాకి మాత్రమే కాక పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాకి కూడా తమన్ మ్యూజిక్ అందించడం విశేషం. దాదాపు రెండు సినిమాలలో పెద్దగా పాఠశాలకు ప్రాధాన్యత ఉండదు. స్టోరీ బేస్ కాన్సెప్ట్ సినిమాలు కావటంతో .. అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తమన్ అందించినట్లు ఇండస్ట్రీ వర్గాల లో టాక్ నడుస్తుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!