Acharya: మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆచార్య సినిమా ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ హల్చల్ చేస్తూ ఫ్యాన్స్లో హైప్ పెంచుతున్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. అదేంటంటే, ఈ సినిమాలోని ఒక సీక్వెన్స్ ప్రేక్షకులకు రోమాలు నిక్కపొడిచేలా చేస్తుందట. మొత్తం సినిమాలో ఇదే బిగ్గెస్ట్ హైలెట్ అని, ఈ సీన్ వచ్చినప్పుడు థియేటర్లు దద్దరిల్లేలా ప్రేక్షకులు విజిల్స్ వేయడం పక్కా అని టాక్ నడుస్తోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Acharya: ఇంటర్వెల్ సీక్వెన్స్ మూవీలోనే బిగ్గెస్ట్ హైలైట్!
2 వారాల క్రితం విడుదలైన ఆచార్య ట్రైలర్ బాగా ట్రెండ్ అయింది. ఈ ట్రైలర్ చివర్లో రామ్ చరణ్ చిరంజీవి చేతి మీద కాలు పెట్టి.. పైకి ఎగిరి.. ప్రత్యర్థి గుండెలో ఈటె లాంటి పదునైన ఆయుధంతో పొడుస్తాడు. ఆ తరువాత చరణ్ ప్రత్యర్థులపై చిరుతపులిలా విరుచుకు పడతాడు. ఈ సీన్ బాగా ఆకట్టుకునేలా ఉంది. ట్రైలర్ లో చూపించిన ఈ సీన్ ఇంటర్వెల్ బ్యాంగ్ అయి ఉండొచ్చని తెలుస్తోంది. ఈ హైవోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ చెర్రీ ఇంట్రడక్షన్ సీన్ అని టాక్ నడుస్తోంది. అలాగే ఇది సినిమా మొత్తంలో బిగ్గెస్ట్ హైలెట్ అని చెబుతున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
థియేటర్స్ దద్దరిల్లేలా ప్రేక్షకులు విజిల్స్ వేయడం పక్కా
థియేటర్లలో ఈ సీన్ ఫ్యాన్స్ చేత ఈలలు వేయిస్తుందని అంటున్నారు. ఈ యాక్షన్ ప్యాక్డ్ సీన్ వచ్చినప్పుడు థియేటర్స్ దద్దరిల్లేలా ప్రేక్షకులు విజిల్స్ వేయడం పక్కా అని చెబుతున్నారు. ఈ సన్నివేశమే కాకుండా చిరు, చరణ్ లపై చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు మూవీలో హైలైట్ గా నిలుస్తాయని మూవీ ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరికొద్ది గంటల్లో రిలీజ్ కానున్న ఈ మెగా మల్టీస్టారర్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!