సినిమా ఇండస్ట్రీ వల్ల తాము నష్టపోతున్నామని, తమ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని, త్వరలోనే స్పందించి నష్ట నివారణ చర్యలు చేపట్టకపోతే తాము థియేటర్స్ మూసివేస్తామని కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు థియేటర్ సంఘం వార్నింగ్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం విధించిన 8 శాతం పన్ను మినహాయించాలని, అలాగే సినిమా విడుదలైన 100 రోజుల తర్వాతే డిజిటల్ ఫ్లాట్ ఫామ్లో ప్రదర్శింపబడేలా చర్యలు తీసుకోవాలని థియేటర్ సంఘం ప్రతినిధులు కోరారు. పెద్ద సినిమాల కారణంగా నష్టపోతే చిత్ర నటీనటులే తమకు న్యాయం చేయాలని కూడా వారు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నేరవేర్చకపోతే, మార్చి 1న రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్స్ మూసివేస్తామని థియేటర్స్ సంఘం పేర్కొంది. మరి దీనిపై కోలీవుడ్ పెద్దలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!