Adi Purush: “బాహుబలి 2” తర్వాత ప్రభాస్ పాపులారిటీ ప్రపంచవ్యాప్తంగా పాకిపోయిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ప్రభాస్ మారిపోయాడు. ఒకప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమకే పరిమితమైన ప్రభాస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సాధించటంతో… దాదాపు అన్ని కూడా పాన్ ఇండియా సబ్జెక్టులే చేస్తూ వస్తున్నాడు. కానీ దురదృష్టం ఏమిటంటే “బాహుబలి 2” తర్వాత ప్రభాస్ చేసిన సాహో, రాదేశ్యం రెండు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఈ రెండు సినిమాలు “బాహుబలి 2” విడుదల కాకముందు ప్రభాస్ ఓకే చేసిన సబ్జెక్టులు.
కాగా ఇప్పటినుండి “బాహుబలి 2” విజయం సాధించిన తర్వాత ప్రభాస్ ఒప్పుకుంటున్న సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ క్రమంలో ముందుగా బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో “ఆది పురుష్” అనే సినిమా చేయడం తెలిసిందే. ఈ సినిమా జనవరి 12వ తారీకు సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ సినిమాకి సంబంధించిన టీజర్ అక్టోబర్ రెండవ తారీకు అయోధ్యలో రిలీజ్ చేస్తున్నారు. చాలా భారీ వేడుకగా సినిమా యూనిట్ ప్లాన్ చేయడం జరిగింది. ఈ క్రమంలో “ఆది పురుష్” టీజర్ విడుదల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హాజరుకానున్నారట.
ఈ సందర్భంగా అక్టోబర్ మొదటి తారీకు యోగినీ కలవడానికి సినిమా యూనిట్ వెళ్తున్నట్లు సమాచారం. “ఆది పురుష్” టీజర్ వేడుకతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేయనున్నారట. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా కృతి సన్నన్ నటించడం జరిగింది. ఇంకా ఈ మూవీలో సోనాల్ చౌహన్ కూడా నటిస్తోంది. ఆది పురుష్ రామాయణం ఆధారం చేసుకుని ఈ సినిమా తీయడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!