Veera Simha Reddy: బాలకృష్ణ “వీరసింహారెడ్డి” ప్రీ రిలీజ్ వేదిక మార్పు చేయడం జరిగింది. మొదట ఒంగోలులోని ABM కాలేజీ గ్రౌండ్ లో ఈనెల ఆరోవ తారీకు నిర్వహిస్తున్నట్లు రెండు రోజుల క్రితమే ప్రకటించడం జరిగింది. అయితే కొన్ని కారణాలవల్ల నిర్ణయాన్ని మార్చుకున్నట్లు మేకర్స్ తెలియజేశారు. ఈ క్రమంలో వేదికను అర్జున్ ఇన్ఫ్రా గ్రౌండ్ కి మార్చినట్లు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
తమన్ అందించిన సంగీతం.. మరోసారి హైలెట్ గా నిలిచింది. ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలయ్య చాలా పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. కర్నూల్ ఇంకా కొన్నిచోట్ల ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ సన్నివేశాలు సినిమాపై అంచనాలు పెంచేయడం జరిగింది. వాస్తవానికి ఈ సినిమా దసరా పండుగకు రిలీజ్ కావాల్సింది. అయితే సినిమా ప్రారంభించిన తొలినాళ్ళల్లో బాలకృష్ణతో పాటు సినిమా యూనిట్ మొత్తం కోవిడ్ బారిన పడింది. దీంతో షూటింగ్ ఆలస్యం కావడంతో సంక్రాంతికి విడుదల అవుతుంది. జనవరి 12వ తారీకు “వీరసింహారెడ్డి” రిలీజ్ చేస్తున్నారు.
బాలయ్య కెరియర్ లో అతిపెద్ద బ్లాక్ బస్టర్… ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్ సినిమా సమరసింహారెడ్డి. అయితే ఈ సినిమా సమరసింహారెడ్డికి 200 రెట్లు ఉంటుందని డైరెక్టర్ చెప్పడంతో… అంచనాలు మరింత పెరిగిపోయాయి. కాగా జనవరి ఆరవ తారీకు అనగా రేపు సాయంత్రమే థియేటర్ ట్రైలర్ కూడా రిలీజ్ కానుంది. “వీరసింహారెడ్డి” విడుదలైన మరుసటి రోజే చిరంజీవి నటించిన “వాల్తేరు వీరయ్య” రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాలు సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!