Vijay Thalapathy: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ఇటీవలె `బీస్ట్` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్వకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 13న విడుదలై.. తొలిరోజే నెగటివ్ టాక్ ను మూటగట్టుకుంది. అయితే టాక్ ఎలా ఉన్నప్పటికీ.. విజయ్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే కలెక్షన్స్ రాబట్టింది. ఇకపోతే విజయ్ తన తదుపరి చిత్రాన్ని ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో అనౌన్స్ చేశారు.
`విజయ్ 66` వర్కింగ్ టైటిల్ తో ఇటీవలె గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. మరి కొద్ది రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ బడా నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. తమన్ సంగీత దర్శకుడిగా ఎంపిక అయ్యాడు. అయితే విజయ్ మాస్ ఇమేజ్ కు తగ్గట్లు ఈ సినిమా కథ ఉంటుందని అందరూ భావించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కానీ, తాజాగా `విజయ్ 66` స్టోరీ లీకైనట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దాని ప్రకారం.. ఈ మూవీ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అట. ఓ కుటుంబం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందని.. బంధాలు, బంధుత్వాత ప్రాముఖ్యతని తెలియజేసేలా దీనిని రూపొందించబోతున్నారని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే గతంలో వంశీ పైడిపల్లి ఎన్టీఆర్ తో తీసిన `బృందావనం` మాదిరి `విజయ్ 66` స్టోరీ ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఆసక్తికర విషయం ఏంటంటే.. `బృందావనం`ను కూడా దిల్ రాజునే నిర్మించారు. 2010లో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఘనవిజయాన్ని సాధించింది. అలాగే డైరెక్టర్ వంశీ పైడిపల్లి కెరీర్లో చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ మూవీనే వంశీ రిపీట్ చేయబోతున్నాడని.. బృందావనం తరహాలో విజయ్ 66లోనూ ఫ్యామిలీ ఎమోషన్స్ బలంగా ఉంటాయని టాక్ నడుస్తోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో త్వరలోనే తెలియనుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!