Sai Pallavi: హీరోయిన్ సాయి పల్లవి “విరాటపర్వం” ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా గోరక్షకుల పై కాశ్మీర్ ఫైల్స్ సినిమా పై చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఈ క్రమంలో సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో బజరంగ్దళ్ కార్యకర్తలు సాయి పల్లవి పై పోలీసులకు కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. కొన్ని వీడియో ఫుటేజ్ లు ఆధారంగా కూడా సమర్పించడం జరిగింది. కాశ్మీర్ పండిట్ల పై దారుణంగా ప్రవర్తించే వారిపై అదేవిధంగా గోవధ కోసం ఆవుల అక్రమాలను అడ్డుకునే గోసంరక్షకులను ఒకటే అన్న తరహాలో సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి తెరలేపినట్లు అయింది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
సాయి పల్లవి పై హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే ఈ విషయంపై సీనియర్ హీరోయిన్ బీజేపీ నేత విజయశాంతి ఘాటుగా స్పందించారు. అవగాహన లేని విషయాలకు ఇష్టానుసారంగా మాట్లాడకూడదు అని చురకలంటించారు. విజయశాంతి మాట్లాడిన మాటలు…‘‘కశ్మీర్ పండిట్లపై దారుణ అకృత్యాలకు పాల్పడిన వారిని.. గోవధ కోసం ఆవుల అక్రమ రవాణాకు పాల్పడేవారిని అడ్డుకున్న గోసంరక్షకులను ఒకే గాటన కడుతూ హీరోయిన్ సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర వివాదానికి దారి తీశాయి. మతోన్మాదంతో పండిట్లపై మారణకాండ సృష్టించడం.. ధర్మం కోసం దైవ సమానమైన గోవులను కాపాడుకునేందుకు గోరక్షకులు చేసే పోరాటం ఒకటే ఎలా అవుతాయో కాస్త ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది.
డబ్బు కోసం దోపిడీ దొంగ ఎవరినైనా కొట్టడం.. తప్పు చేసిన పిల్ల వాడిని తల్లి దండించడం ఏ విధంగా ఒకటవుతాయి? ఆ దోపిడీ దొంగను, తల్లిని ఒకేలా చూస్తారా? ఎవరైనప్పటికీ తమకు అవగాహన లేని విషయాల ప్రస్తావన వచ్చినప్పుడు సున్నితంగా ఆ అంశాన్ని పక్కన పెట్టడం మంచిది. నేడు మనం మాట్లాడే ప్రతి మాట క్షణాల్లో కోట్లాది మందికి చేరిపోతూ…. ఆ మాటల్లో ఏ మాత్రం తేడా ఉన్నా పట్టుకుని ప్రశ్నించే సమాజంలో ఉన్నాం. అందువల్ల మాట్లాడే అంశాలపై సమగ్ర అవగాహనతో… సామాజిక స్పృహతో స్పందించడం చాలా అవసరమని గ్రహించాలి’’ అని పేర్కొన్నారు. దీంతో విజయశాంతి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!