Sai Pallavi: `లవ్ స్టోరీ`, `శ్యామ్ సింగరాయ్` చిత్రాలతో రెండు భారీ హిట్స్ను ఖాతాలో వేసుకున్న సాయి పల్లవి.. ఇప్పుడు `విరాటపర్వం`తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీకి సంబంధించి తాజాగా సాయి పల్లవి ఫ్యాన్స్ ను ఖుషీ చేసే ఓ గుడ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్లే..
నక్సలిజం బ్యాక్డ్రాప్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించారు. ప్రియమణి, సాయిచంద్, నందితా దాస్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించగా వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై దగ్గుబాటి సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్నా.. విడుదలకు మాత్రం నోచుకోలేదు. ఎట్టకేలకు ఈ సినిమాను జూలై 1న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే గత రెండు రోజుల నుంచీ ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రీ పోన్ కానుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇప్పుడు ఆ ప్రచారమే నిజమైంది. మొదటగా అనుకున్న తేదీకంటే ముందుగానే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మేకర్స్ తాజాగా విరాటపర్వం చిత్రాన్ని జూన్ 17న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు స్పెషల్ వీడియో పంచుకుంది. ఈ వార్త నిజంగా రానా – సాయి పల్లవి అభిమానులకు గుడ్ న్యూసే అవుతుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!