Adipurush : తెలుగు ఇండస్ట్రీ లోనీ హీరోలందరూ వారి సత్తాను కేవలం దక్షిణాది రాష్ట్రాలకు మాత్రమే పరిమితం చేశారు. అయితే టాలీవుడ్ లో యంగ్ రెబల్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రభాస్ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా పాన్ ఇండియా హీరోగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. అప్పటినుంచి తెలుగు ఇండస్ట్రీలో నటించే హీరోలందరూ కూడా దేశవ్యాప్తంగా వారి టాలెంట్ నిరూపించుకోవాలని పాన్ ఇండియా తరహాలోనే చిత్రాలను నిర్మిస్తున్నారు.
తాజాగా ప్రభాస్ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదిపురూష్ చిత్రంలో నటిస్తున్నారు. రామాయణ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో సీత పాత్రలో కృతి సనన్ నటిస్తున్నట్లు సమాచారం. హోంభలే నిర్మాణ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర బృందం ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ద్వారా ఒక్కసారిగా బాలీవుడ్ లో ప్రభాస్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. దేశ వ్యాప్తంగా ఈ సినిమా కోసం ఎంతగానో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా ఏ విధంగా ఉంటుందనే ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ లో ప్రభాస్ క్రేజ్ చూస్తే తెలుగు స్టార్ హీరోలైన చిరంజీవి, పవర్ స్టార్ ,మహేష్ వంటి హీరోలు సైతం ఆశ్చర్యపోతారు.
ప్రస్తుతం తెలుగు సినిమా హీరోల అందరి దృష్టి కూడా ఉత్తరాది వైపు మళ్ళింది. వారు నటించిన సినిమాలు పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించారు. దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాలలో కూడా మంచి గుర్తింపు సంపాదించుకోవాలని ఉద్దేశంతో ప్రతి ఒక్క హీరో ఉత్తరాది రాష్ట్రాల్లో సందడి చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ ,రామ్ చరణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండవంటి హీరోలు వారి నటించే చిత్రాలను పాన్ ఇండియా రూపంలో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు నిర్మాతలు. మొత్తానికి దక్షిణాది హీరోలందరూ, ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లి తమ సత్తా చాటుకోవాలని అక్క ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!