నవంబరు 10న తిరుచానూరులో తిరుపతి, సిరులతల్లి తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 11 నుండి 19వ తేదీ వరకు వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నవంబరు 10వ తేదీన మంగళవారం ఆన్లైన్ విధానంలో లక్షకుంకుమార్చన ఏకాంతంగా జరుగనుంది.
భక్తులు తమ నివాస ప్రాంతాల నుండి ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించడం ద్వారా అమ్మవారి సేవలో ప్రత్యక్షంగా పాల్గొన్నామన్న భావన కలుగుతుంది. లక్షకుంకుమార్చన టికెట్లు నవంబరు 6వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల నుండి ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. ఈ కార్యక్రమం నవంబరు 10వ తేదీ ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారమవుతుంది.
ఈ సేవలో పాల్గొనే భక్తులకు ఉత్తరీయం, రవిక, కుంకుమ, అక్షింతలు, రెండు పసుపుదారాలు, కలకండ ప్రసాదంగా తపాలా శాఖ ద్వారా గృహస్తుల చిరునామాకు పంపడం జరుగుతుంది.
www.tirupatibalaji.ap.gov.in వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.