మాసాలలో ఎక్కువ శుభకార్యాలు ఆచరించే మాసం శ్రావణమాసం. ఈ మాసమంతా ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది. ముఖ్యంగా కొత్తగా పెండ్లయిన మహిళలు ఆచరించే వ్రతం మంగళగౌరీ వ్రతం.
ఈ మాసంలో వచ్చే మంగళవారాలలో దీన్ని ఆచరిస్తారు. ఇలా పెండ్లి అయిన ఐదు ఏండ్లు క్రమం తప్పకుండా దీన్ని భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరిస్తారు.
దీన్ని శ్రావణ మంగళవార వ్రతం అనీ, మంగళగౌరీ నోము అని వివిధ రకాలుగా పిలుస్తుంటారు. ఈ వ్రతాన్ని గురించి నారధుడు సావిత్రికి, శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని కొత్తగా ప్ళ్లైన వారు ఆచరించాలి. వివాహమైన తర్వాత వచ్చే శ్రావణంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించాలి. శ్రావణమాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి. ఐదు సంవత్సరాల పాటు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించి ఉద్వాపన చేయాలి. దీంతో వారు నిండు సుమంగళిగా ఉండడమే కాకుండా వారి కుటుంబంలో సుఖశాంతులు, అష్ట ఐశ్వర్యాలు ఉంటాయి.