Pawan Kalyan on 10th Class Exams: పదవ తరగతి పరీక్షల్లో తక్కువ మార్కులతో ఫెయిల్ అయిన విద్యార్ధుల కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి కీలక సూచన చేశారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఉత్తీర్ణత శాతం తగ్గిందని ఆరోపించిన పవన్ కళ్యాణ్.. వెంటనే పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్ధులకు పది గ్రేస్ మార్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉత్తీర్ణత శాతం తగ్గడానికి తల్లిదండ్రులే కారణమని మంత్రులు వ్యాఖ్యానించడాన్ని పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. విద్యార్ధులకు సరైన విద్యను అందించకుండా ప్రభుత్వం ఆ తప్పును తల్లిదండ్రులపై నెట్టడం సరికాదని అన్నారు. విద్యార్ధులకు పది గ్రేస్ మార్కులు ఇస్తే ప్రభుత్వం వారికి న్యాయం చేసినట్లు అవుతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Pawan Kalyan requests the Government of Andhra Pradesh to allot 10 grace marks for every student who had written 10th class exams in 2022.
- Read the latest news from
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Pawan Kalyan on 10th Class Exam Results: రీవాల్యూయేషన్ ఉచితంగా చేయాలి
అదే విధంగా రీవాల్యూయేషన్ కూడా ఉచితంగా చేయాలని పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి సూచించారు. రీ వాల్యుయేషన్ కోసం రూ.500లు చెల్లించాలని ఫెయిల్ అయిన విద్యార్ధులను బాధించడం సరికాదని అన్నారు. ఇది దోపిడీ విధానమేనని విమర్శించారు. అలానే సప్లిమెంటరీ పరీక్షలకు కూడా ఎలాంటి ఫీజు తీసుకోకుండా పరక్షలను ప్రభుత్వం నిర్వహించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. సోమవారం నాడు ప్రభుత్వ పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కేవలం 67.26 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా పదవ తరగతి పరీక్షలు నిర్వహించలేదు. 8,9 తరగతులు కూడా సక్రమంగా సాగలేదు. రెండేళ్ల విరామం తరువాత పదవ తరగతి పరీక్షలు మొదటి సారి జరిగాయి. వివిధ రకాల కారణాల నేపథ్యంలో దాదాపు 2లక్షల మంది విద్యార్ధులు ఫెయిల్ అయ్యారు. మొత్తం 6,15,908 మంది విద్యార్ధులు పరీక్షలు రాయగా 4,14,281 మంది మాత్రమే అత్తీర్ణులయ్యారు.
Pawan Kalyan demands for free revaluation of 10th class exam results.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన సూచనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని గ్రేస్ మార్కులు కలపాలని విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. రెండు మూడు మార్కుల తేడాతో వేలాది మంది ఒక రెండు సబ్జెట్ లలో ఫేయిల్ అయ్యారనీ, ప్రభుత్వం గ్రేస్ మార్కులు కలిపితే వేలాది మంది విద్యార్ధినీ విద్యార్ధులకు లబ్దికలుగుతుందని అంటున్నారు. చూడాలి ప్రభుత్వం దీనిపై ఏ విధంగా స్పందిస్తుందో.