Sreeleela: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న మూడో సినిమా “గుంటూరు కారం”. వచ్చే జనవరి సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ ఆయన నాటి నుండి అనేక అవంతరాలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. 2022 ఫిబ్రవరి నెలలో సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలు స్టార్ట్ కాగా తర్వాత సెప్టెంబర్ నెలలో మహేష్ తల్లి ఇందిరా గారు మరణించడం జరిగింది.
ఆ తర్వాత సినిమా షూటింగ్ స్టార్ట్ కాగా డిసెంబర్ నెలలో సూపర్ స్టార్ కృష్ణ మరణించడం జరిగింది. దీంతో అనేక వాయిదాల పడుతూ సినిమా షూటింగ్ జరుగుతున్న క్రమంలో మొదట హీరోయిన్ అనుకున్న పూజ హెగ్డే ప్రాజెక్టు మధ్యలోనే విడిచిపెట్టి వెళ్లిపోవడం జరిగింది. దీంతో సెకండ్ హీరోయిన్ అనుకున్న శ్రీ లీలనీ మెయిన్ హీరోయిన్ గా తీసుకోవడం జరిగింది.
ఈ క్రమంలో సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని తీసుకోవడం జరిగింది. అయితే ఇటీవల డైరెక్టర్ త్రివిక్రమ్ మీనాక్షి చౌదరి చేసిన “అవుట్ ఆఫ్ లవ్” వెబ్ సిరీస్ చూసి.. గుంటూరు కారం హీరోయిన్ విషయంలో నిర్ణయం మార్చుకున్నారట. మేటర్ లోకి వెళ్తే శ్రీ లీల ప్లేస్ లో మీనాక్షి చౌదరి అయితే కరెక్ట్ అని డిసైడ్ అయ్యారట. దీంతో యధావిధిగా..
మొదట అనుకున్నట్లు శ్రీ లీలనీ సెకండ్ హీరోయిన్ గా కంటిన్యూ చేయాలని భావిస్తున్నారట. ఇదే విషయాన్ని శ్రీ లీల దృష్టికి తీసుకురాగా పిచ్చ కోపంగా మండిపడిందట. ఇన్నిసార్లు మార్చడం ఏంటి అని.. సినిమా యూనిట్ మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఇండస్ట్రీలో టాక్. మహేష్ బాబు సినిమాలో మెయిన్ హీరోయిన్ అని మొదట ప్రచారం చేసి తరువాత ఇప్పుడు సెకండ్ హీరోయిన్ గా చేయమంటే నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని మేకర్స్ కి తెలియజేసిందట.
ఇప్పుడిప్పుడే పెద్ద స్టార్ హీరోలతో నటిస్తూ ఉన్నాను. ఇలాంటి టైంలో సెకండ్ హీరోయిన్ గా నటించడం నావల్ల కాదు. ఈ విషయంలో.. తగ్గేది లేదు అని చెప్పుకొస్తుందట. “గుంటూరు కారం” లో మెయిన్ హీరోయిన్ అని నా గురించి బాగా ప్రచారం చేశారు. ఇప్పుడు సెకండ్ హీరోయిన్ గా చేయాలంటే నావల్ల కాదు అని శ్రీ లీల తేగేసి చెప్పిందట. ఇలా అయితే నేను “గుంటూరు కారం” సినిమా చేయను అని కండిషన్ కూడా పెట్టిందట. దీంతో సినిమా యూనిట్ డైలమాల పడినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!