Tillu Square: ఈవారం థియేటర్స్ లో విడుదలైన క్రేజీ చిత్రాల్లో టిల్లు స్క్వేర్ ఒకటి. 2022లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ డీజే టిల్లు మూవీకి సీక్వెల్ ఇది. డీజే టిల్లు చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించారు. విమల్ కృష్ణ దర్శకుడుగా వ్యవహరించాడు. రెండేళ్ల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో సిద్ధు జొన్నలగడ్డ ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. డీజే టిల్లుతో ఇండస్ట్రీలో అతనకు ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇక ఇదే చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన మూవీ టిల్లు స్క్వేర్. మల్లిక్ రామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డకు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించింది.
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు. ఇందులో మురళి శర్మ, ప్రిన్స్ సెసిల్, మురళీధర్ గౌడ్, నేహా శెట్టి తదితరులు కీలక పాత్రలను పోషించారు. రామ్ మిరియాల, శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. అలాగే టిల్లు స్క్వేర్ లో సిద్దు జొన్నలగడ్డ హీరోగానే కాకుండా.. రచయితగా కూడా పని చేశారు. ఈ మూవీకి కథ, మాటలు అతనే స్వయంగా అందించారు. భారీ అంచనాల నడుమ మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన టిల్లు స్క్వేర్ చిత్రానికి హిట్ టాక్ లభించింది.
డీజే టిల్లు మూవీలో స్టోరీ కంటే టిల్లు పాత్రలో సిద్దు నటనే ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంది. అతని నటనా శైలి, పలికించే హావభావాలు, కామెడీ టైమింగ్ రెండు గంటల పాటు థియేటర్లలో హాయిగా నవ్వుకునేలా చేశారు. ఇక టిల్లు స్క్వేర్ చిత్రాన్ని కూడా సింపుల్ లైన్ తో తెరకెక్కించారు. అయితే టిల్లు పాత్రలో సిద్ధు నటన సాధారణమైన కథను అద్భుతంగా నిలబెట్టింది. ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేసింది. అలాగే సిద్దు చేసే అల్లరి, అతని నటన, అనుపమ అందచందాలు, కామెడీ మరియు కథలో భాగంగా వచ్చే ట్విస్టులు సినిమాకు హైలెట్ గా నిలిచాయి. దీంతో తొలి రోజు టిల్లు గాడు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా ఊచకోత కోసేసాడు.
ఎవరి ఊహలకు అందని రేంజ్ లో టిల్లు స్క్వేర్ సినిమా సునామీ సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి మొదటి రోజు ఏకంగా రూ. 23.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 11.5 కోట్ల వసూళ్లను టిల్లు స్క్వేర్ సొంతం చేసుకుంది. అలాగే కర్ణాటకలో రూ. 1 కోటి, తమిళనాడులో రూ. 2 లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 15 లక్షల వరకు గ్రాస్ కలెక్షన్స్ వసూల్ చేసినట్లు ప్రముఖ ట్రేడ్ సంస్థలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఓవర్సీస్లో తొలి రోజు రూ. 10 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయని తెలుస్తోంది.
ఇక 2022లో వచ్చిన డిజే టిల్లు మూవీ నైజాం ఏరియాలో రూ. 1.59 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంటే.. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ అయిన టిల్లు స్క్వేర్ మొదటి రోజు ఏకంగా రూ. 4.35 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది. ఈ దెబ్బతో సిద్ధు జొన్నలగడ్డ మీడియం రేంజ్ హీరోల జాబితాలో చేరిపోయాడు. అలాగే నైజాం ఏరియాలో తొలి రోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో సిద్ధు మూవీ మూడో స్థానంలో నిలవడం విశేషం.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!