అల్లు శిరీష్.. ఈ యంగ్ హీరో గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శిరీష్.. నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. కానీ సరైన హిట్లు లేకపోవడంతో ఈయన కెరియర్ బాగా డౌన్ అయిపోయింది.
అప్పుడెప్పుడో 2019లో వచ్చిన `ఏబీసీడీ` తర్వాత అల్లు శిరీష్ నుంచి మరో సినిమా రాలేదు. అయితే ఎట్టకేలకు ఈయన `ఊర్వశివో రాక్షసివో` అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లో అల్లు శిరీష్, అను ఇమాన్యుయెల్ జంటగా నటించారు. నవంమర్ 4న ఈ చిత్రం విడుదల కానుంది.
అయితే ఈ సినిమా పోస్టర్స్లో శిరీష్, అను కెమిస్ట్రీ చూసి వీరు నిజంగా ప్రేమలో పడ్డారని, డేటింగ్ చేస్తున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై తాజాగా అల్లు శిరీష్ ఓపెన్ అయ్యాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శిరీష్ మాట్లాడుతూ.. `అనూకు, నాకు మధ్య ప్రేమ అనే బంధం లేదని, డేటింగ్ లో ఉన్నామంటూ వస్తున్న వార్తలు అవాస్తవం` అని క్లారిటీ ఇచ్చారు.
`అయితే మా ఇద్దరి అభిప్రాయాలు, అభిరుచులు ఒకేలా ఉండడంతో మేమిద్దరం మంచి స్నేహితులు అయ్యాము. దాంతో సినిమాలో రొమాంటిక్ సీన్స్ చేయడానికి పెద్దగా ఇబ్బంది పడలేదు. అయినా సోషల్ మీడియాలో ఎవరిష్టం వచ్చినట్టు వారు కామెంట్లు చేస్తారు. అందుకే రెండేళ్ల నుంచి ఆన్లైన్ కు దూరంగా ఉంటున్నాను` అంటూ శిరీష్ చెప్పుకొచ్చారు. దీంతో శిరీష్ కామెంట్స్ కాస్తా వైరల్ గా మారాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!