`అఖండ` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం నటసింహం నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేనితో ఓ సినిమాను పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. బాలయ్యకు ఇది 107వ ప్రాజెక్ట్ కావడంతో.. ఈ చిత్రాన్ని `ఎన్బీకే 107` వర్కింగ్ టైటిల్తో ప్రారంభించారు. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.
కన్నడ నటుడు దునియా విజయ్ విలన్గా చేస్తుంటే.. విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నిర్మితమవుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తొంబై శాతం షూటింగ్ను కంప్లీట్ చేసుకుంది. మిగిలిన భాగాన్ని సైతం మేకర్స్ త్వరత్వరగా పూర్తి చేసే పనిలో ఉన్నారు.
ఇప్పటికే బయటకు వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశారు. ఇక అక్టోబర్ 21న ఈ సినిమా టైటిల్ లోగోను కర్నూల్లోని కొండా రెడ్డి బురుజు దగ్గర లాంచ్ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. `ఎన్బీకే 107`కు భారీ లెవల్లో బిజినెస్ జరుగుతోందట.
ఈ చిత్రానికి నైజాంలో రూ.20 కోట్లు, సీడెడ్లో రూ.14 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో రూ.35 కోట్ల వరకు డిమాండ్ ఏర్పడుతుందట. వరల్డ్ వైడ్గా దాదాపు రూ.80 కోట్ల వరకు బిజినెస్ జరిగే అవకాశాలు ఉన్నాయట. అలాగే మరోవైపు ఈ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ రూ.60 కోట్లకు అమ్ముడైనట్లు టాక్ నడుస్తోంది. ఈ సినిమాకు సుమారుగా నిర్మాతలు రూ.70 కోట్ల వరకు బడ్జెట్ను కేటాయించారట. ఈ లెక్కన చూసుకుంటే విడుదలకు ముందే ఈ చిత్రం డబుల్ ప్రాఫిట్స్ను తెచ్చిందని అంటున్నారు.
https://newsorbit.com/cinema/production-company-given-title-update-regarding-nbk-107.html
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!