Cameraman Gangatho Rambabu: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం రీ రిలీజ్ పర్వం కొనసాగుతుంది. ఈ ట్రెండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు స్టార్ట్ చేయడం జరిగింది. గత ఏడాది మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా “పోకిరి” రీ రిలీజ్ చేయాలని ఒత్తిడి తేవడంతో ఆ సినిమా సరికొత్త ప్రింట్ తో మహేష్ పుట్టినరోజు కానుకగా విడుదల చేశారు. ఆ రకంగా రీ రిలీజ్ ల పర్వం స్టార్ట్ కావడం జరిగింది. అప్పటినుండి చాలామంది హీరోల సినిమాలు మళ్లీ రీ రిలీజ్ అవుతున్నాయి. లేటెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన “కెమెరామెన్ గంగతో రాంబాబు” రిలీజ్ చేస్తున్నారు.
ఫిబ్రవరి 7వ తారీకు ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలో నిర్మాత నట్టి కుమార్ మాట్లాడుతూ.. కెమెరామెన్ గంగతో రాంబాబు రీ రిలీజ్ లో అమ్ముడుపోయే ప్రతి టికెట్టు పై పది రూపాయలు జనసేన పార్టీ నిధి కోసం అందజేస్తామని స్పష్టం చేశారు. ఈ సినిమా నేటి రాజకీయాలకు అద్దం పట్టేలా ఉంటుంది. ఇందులో డైలాగ్స్ ఎవరికి తగలలో వాళ్లకి తగులుతాయి. పవన్ ఆలోచనలను మరింత మందికి చేరవేయాలన్నదే మా దృక్పథం.. అని వ్యాఖ్యానించారు. 2013వ సంవత్సరంలో ఈ సినిమా రిలీజ్ అయింది.
ఈ సినిమాలో ఛానల్ రిపోర్టర్ గా పవన్ కళ్యాణ్ కనిపిస్తారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన ఈ రెండో సినిమాపై అప్పట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా “గబ్బర్ సింగ్” లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత కెమెరామెన్ గంగతో రాంబాబు రావటంతో అభిమానులు ఓ రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు. కానీ సినిమా అంతగా మెప్పించలేకపోయింది. అప్పటి తెలుగు రాష్ట్రాల రాజకీయాలను అడ్డం పట్టేలా తీసిన ఈ సినిమా ఏమాత్రం ప్రేక్షకులను అలరించలేకపోయింది. అయినా గాని పది సంవత్సరాల తర్వాత సినిమా రీ రిలీజ్ చేస్తుండటంతో.. “కెమెరామెన్ గంగతో రాంబాబు” చూడటానికి పవన్ ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉండటం విశేషం.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!