ప్రతి ఒక్కరూ పుష్కర నది ని పూజించుకుంటూ ఉంటారు. పుష్కరం అనేది నదులను పూజించుకోవడానికి అంకితం చేయబడిన భారతీయ పండగ. ఇది భారతదేశంలోని 12 ప్రధాన పవిత్ర నదుల ఒడ్డున ఉన్న పుణ్యక్షేత్రాలలో, పూర్వికుల ఆరాధన, భక్తి సంగీతం మరియు సాంస్కృతిక కార్యక్రమాల రూపంలో జరుపుకుంటాము. ఈ వేడుక ప్రతి నదిలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ప్రతి నది ఒక రాశితో ముడిపడి ఉంటుంది.
ఇక ప్రతి సంవత్సరం పండగకు సంబంధించిన నది ఆ సమయంలో బృహస్పతి ఏ రాశిలో ఉంటుందో దానిపై ఆధారపడి ఉంటుంది. ప్రాంతీయ వైవిధ్యాల కారణంగా, కొన్ని రాశిచక్ర గుర్తులు బహుళ నదులతో బంధం కలిగి ఉంటాయి. ఇక ఈ సంవత్సరం నర్మదా నది పుష్కరాలు 2024 మే 1 నుంచి ప్రారంభం అయ్యి మే 12న ముగుస్తాయి. మే 1 నుంచి 12 వరకు ప్రతిరోజు కొన్ని దానాలు ఇస్తూ ఉండాలి. అదేవిధంగా ప్రతిరోజు ఇంట్లో పూజ చేయాలి. ఇలా చేయడం ద్వారా ఆ భగవంతుడు ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. ఇక పుష్కరాల సమయంలో చేయాల్సిన దానాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
• మొదటిరోజు:
సువర్ణ దానం, రజితం దానం, ధన్యవాదాలు, భూదానం చేయాలి.
• రెండవ రోజు:
వస్త్ర దానం, లవణ దానం, రక్తం దానం చేయాలి.
• మూడవరోజు:
బెల్లం దానం, పూల దానం వంటివి చేయాలి.
• నాల్గవ రోజు:
నెయ్యి దానం, నూనె దానం, పాలు దానం, తేనె దానం చేయాలి.
• ఐదవ రోజు:
ధన్య దానం, శకట దానం, వృషభదానం చేయాలి.
• ఆరవ రోజు:
ఔషధ దానం, చందన దానం, కస్తూరి దానం చేయాలి.
• ఏడవ రోజు:
గృహదానం, పీట దానం, శయ్య దానం వంటివి చేయాలి.
• ఎనిమిదవ రోజు:
చందనం దానం, కందుమూలాల దానం, పప్పు మాల దానం చెయ్యాలి.
• తొమ్మిదవ రోజు:
పిండదానం, దాసి దానం, కన్యాదానం, కంబళి దానం చేయాలి.
• పదవరోజు:
కూరగాయలు దానం, పండ్ల దానం చేయాలి.
• పదకొండవ రోజు:
గజదనం చేయాలి.
• పన్నెండవ రోజు:
నువ్వులు దానం చేయాలి.
ఈ దానాలు అన్నీ కూడా సాధ్యమైనంత వరకు పేద ప్రజలకు చేయడం మంచిది.