Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా “గుంటూరు కారం” మరికొద్ది గంటల్లో థియేటర్లో ప్రదర్శితం కానుంది. సంక్రాంతి కానుకగా టాలీవుడ్ నుండి విడుదలవుతున్న అతిపెద్ద సినిమా. పైగా ఈ సంక్రాంతికి అత్యధిక థియేటర్లు కూడా గుంటూరు కారంకి లభించడం జరిగింది. దాదాపు ఏడాదిన్నర తర్వాత మహేష్ సినిమా థియేటర్ లో విడుదలవుతున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగ ముందే వచ్చేసినట్టు వాతావరణం ఏర్పడింది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేష్ కి జోడిగా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన అన్ని పాటలు, పోస్టర్లు, టీజర్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకోవడం జరిగింది.
దీంతో సినిమా ఫలితం కోసం అందరూ ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. జనవరి 12వ తారీకు అర్ధరాత్రి ఒంటిగంట నుండే ఈ సినిమాకి సంబంధించి నైట్ షోస్ పడబోతున్నాయట. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లో మహేష్ బాబు తల్లి పాత్రలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ నటిస్తున్న సంగతి తెలిసిందే. తల్లి కొడుకుల మధ్య వచ్చే ఎమోషన్స్ సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా ఉండేలా త్రివిక్రమ్ చిత్రీకరించడం మాత్రమే కాదు డైలాగులు రాసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే మహేష్ తల్లి పాత్రలో నటించిన ఈ హీరోయినే… గతంలో “నాని” సినిమాలో స్పెషల్ సాంగ్ లో స్టెప్పులు వేయడం జరిగింది.
“మార్కండేయ” అనే పాటలో మహేష్… రమ్యకృష్ణ మధ్య.. కెమిస్ట్రీ ఓ రేంజ్ లో ఉంటుంది. సూపర్ స్టార్ తో రొమాంటిక్ సాంగ్లో చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు తల్లి పాత్రలో నటించడం సోషల్ మీడియాలో కాంట్రవర్సీ టాపిక్ గా మారింది. ఈ టాపిక్ పై రకరకాలుగా నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 2004వ సంవత్సరంలో ఎస్ జె సూర్య దర్శకత్వంలో మహేష్ బాబు, అమీషా పటేల్ హీరో హీరోయిన్ లుగా నటించారు. కానీ ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. ఈ సినిమాలో రమ్యకృష్ణ స్పెషల్ సాంగ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు గుంటూరు కారంలో మహేష్ బాబుకి తల్లి పాత్రలో చేయటం చర్చనీయాంశంగా మారింది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!