మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 11 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి వర్క్ చేస్తున్నారు. ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్లో అతడు, ఖలేజా వంటి చిత్రాలు వచ్చాయి. ఈ సినిమాలు కమర్షియల్ గా హిట్ అవ్వకపోయినా ప్రేక్షకులను బాగానే అలరించాయి.
దీంతో వీరి హ్యాట్రిక్ ప్రాజెక్ట్ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. `ఎస్ఎస్ఎమ్బీ 28` వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందిస్తున్నాడు. ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది.
రెండో షెడ్యూల్ దసరా పండుగ అనంతరం ప్రారంభం కానుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే ఈ సినిమాలో అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఉండబోతుందట. వాస్తవానికి త్రివిక్రమ్ సినిమాలో ఐటమ్ సాంగ్ లు ఉండవు. `అత్తారింటికి దారేది` సినిమాలో అలాంటి ప్రత్యేక సాంగ్ ఉన్నా.. దానిని త్రివిక్రమ్ చాలా పద్ధతిగానే చిత్రీకరించాడు.
కానీ ఈసారి మాత్రం రూటు మార్చి మహేష్ కోసం తొలిసారి త్రివిక్రమ్ ఐటమ్ సాంగ్ను ప్లాన్ చేస్తున్నాడట. అది కూడా అలా ఇలా కాకుండా మాస్ సాంగ్ చేయాలని ఆయన నిర్ణయించుకున్నారట. అలాగే ఆ సాంగ్ కోసం ఓ స్టార్ హీరోయిన్ను దింపబోతున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!