Guppedantha Manasu November 30 Today Episode: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఎంతో ఆసక్తిగా ముందుకు సాగుతూ వెళ్తుంది.ఇక ఈరోజు November 30వ తేదీ Guppedantha Manasu సీరియల్ 621వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ముందుగా తెలుసుకుందాం.ఈరోజు ఎపిసోడ్ లో కారులో ఇంటికి బయలుదేరతారు రిషి, వసు, జగతీ, మహేంద్రలు.
ఆనందంలో జగతి :
వసు, రిషీలనే చూసుకుంటూ జగతీ మురిసిపోతుంది. అనుకోకుండా స్పీడ్ బ్రేకర్ రావడంతో ఆ కుదుపులకి అమ్మా అనేస్తుంది జగతీ. ‘సారీ మేడమ్’ అంటాడు డ్రైవ్ చేస్తున్న రిషి. ఆ మాటలకు వసు, జగతీ మురిసిపోతారు. ఇక రిషి డ్రైవ్ చేస్తుంటే.. జగతీ చాలా సంబరంగా ఏదో ఒక మెసేజ్ టైప్ చేసి మహేంద్రకు పంస్తుంది.అయితే ఆ ఫోన్ రిషి దగ్గర ఉండడంతో ఆ మెసేజ్ రిషి ఓపెన్ చేసి చూస్తాడు. మహేంద్రా నా కొడుకు చూడు నన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడో.. ఈ మాట ఇప్పుడు నీకు చెప్పలేను. అందుకే మెసేజ్ చేస్తున్నాను.తన పక్కనే వసుధార వెనుక సీట్లో నేను.. ఈ జన్మకి ఇంతకన్నా ఏం కావాలి? ఈ క్షణం ప్రాణం పోయినా ఫర్వాలేదు మహేంద్రా అంటూ మెసేజ్ టైప్ చేసి పంపేస్తుంది. ఇదేంటి మహేంద్ర ఫోన్ మహేంద్ర దగ్గర లేదా?’ అనుకుంటూ తొంగి చూస్తుంది జగతీ. వెంటనే రిషి ఆ మెసేజ్ డిలెట్ చేసి.. డాడ్ మీ ఫోన్ అని మహేంద్రకు ఇస్తాడు.
రిషిని, జగతిని అలా చూసి షాక్ అయిన దేవయాని :
ఇక ఇంటికి రాగానే కారులోంచి వసు దిగి జగతీని దింపి.. బ్యాగ్స్ తియ్యడానికి వెనక్కి వెళ్తుంది వసు. అప్పుడే జగతీ నెమ్మదిగా అడుగులు వేస్తూ.. నడుస్తుంది. ఇటువైపు నుంచి మహేంద్రను పట్టుకుని రిషీ వస్తూ ఉంటాడు.అప్పుడే జగతీ పడబోతుంటే రిషి ‘మేడమ్’అంటూ వచ్చి పట్టుకుని జగతిని పట్టుకుంటాడు ఆ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది.వాళ్ళని అలా చూసి దేవయాని మనుసులోనే కోపంతో ఊగిపోతుంది.
జగతికి దిష్టి తీసిన ధరణి :
ఇక జగతీ, మహేంద్ర, రిషీలు గుమ్మం లోపల అడుగుపెడుతుంటే ఒక్క నిమిషం అంటూ ధరణీ దిష్టి తీస్తుంది. ఇప్పుడు ఇవన్నీ అవసరమా అని దేవయాని అంటే తియ్యనివ్వండి పెద్దమ్మ అంటాడు రిషి.దేవయాని మాత్రం రగిలిపోతూ ఉంటుంది. ‘మేడమ్ మీరు కింద నా రూమ్లో ఉండండి.. నేను డాడ్ పైనే ఉంటాం’ అని రిషి. మహేంద్రని తీసుకుని వెళ్తాడు. ఇక దేవయాని రగిలిపోతూ.. ధరణీతో. ‘ఏంటి సొంతపెత్తనాలు? దిష్టి తీయాలా వద్దా అని నన్ను అడగాలి కదా?’ అని కోపంగా తిట్టబోతుంటే ‘పెదమావయ్యగారే చెప్పారు అత్తయ్యా అని అమాయకంగా చెప్తుంది.
జగతి మేడంకు క్లాస్ పీకిన రిషి :
ఇక వసు.. జగతీని మంచంపై కూర్చోబెట్టి.. గది చక్కబెడుతూ ఉండగా వచ్చిన రిషి జ్యూస్ తెమ్మని వసుధారాను బయటకు బయటికి పంపించి.. ‘మేడమ్ మీరు ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? డాడ్కి మీరంటే ఎంత ప్రాణమో.. మీకన్నా ఎక్కువగా నాకే తెలుసు.. నేను ఏది చేసినా డాడ్ కోసమే చేశాను. కానీ ఆ మెసేజ్ ఏంటి మేడమ్. నా ప్రాణం పోయినా ఫర్వాలేదు అని పెట్టారు.అది డాడ్ కానీ చూసి ఉంటే ఎంత బాధపడేవారు? కదా?’ అందుకే మెసేజ్ డిలీట్ చేసేసా అని అనడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!