Guppedantha Manasu మహేంద్ర ఏంటమ్మా వసుధార ఇంకా ఏం ఆలోచిస్తున్నావు త్వరగా వెళ్లి రిషి ని చూసి వద్దాం పద అని అంటాడు. అనుపమ ఏంటి మహేంద్ర నువ్వు ఎంత చెప్పినా వినడం లేదు ఎందుకు? అసలు రిషికి ఇక్కడ ప్రమాదం పొంచి ఉందని తెలిసి కూడా నువ్వు ఎందుకు వినడం లేదుఅంటుంది మహేంద్ర నువ్వు ఆగు అనుపమ శత్రువులకు భయపడి నా కొడుకుని నేను ఎక్కడో దాచి పెట్టాల్సిన అవసరం కర్మ ఏంటి నా కొడుకు రాజు లాగా ఇక్కడే ధైర్యంగా ఉండాలి అందుకే వెళ్లి తీసుకువద్దం పదండి అంటాడు. అనుపమ చూడు మహేంద్ర ఎంతటి రాజైనా సరే కాలానికి తలవంచాలి సిచువేషన్ బట్టి మనం కాలాన్ని కొనసాగించాలి అది కాదని ఎదురెళ్లి నిలబడాలి అంటే గుండె ధైర్యం మనోధైర్యం ఉండాలి ఇప్పుడు ఆ రెండు రిషికి లేవు శారీరకంగా నష్టపోయి ఉన్నాడు ఇలాంటి సమయంలో రిషి ని ఇక్కడ శత్రువుల మధ్య తీసుకువచ్చి పెట్టడం అంత మంచిది కాదు కాబట్టి చెప్పేది విను మహేంద్ర రిషి ని ఇక్కడికి అప్పుడే తీసుకురావద్దు వసుధార చెప్పినట్లు విందాము అని అంటుంది.
భద్ర అంటే రిషి సార్ వసుధారకు తెలుసన్నమాట తను ఎక్కడున్నాడు అనే విషయం వసుధారకే తెలుసు కానీ ఎవరికీ చెప్పడం లేదు సరే బిల్లు ఇంకా ఏం మాట్లాడుకుంటారు విందాం అని అటు గోడ పక్కనే ఉండి అన్నీ వింటూ ఉంటాడు భద్ర.అనుకోకుండా భద్రకి ఫోన్ వస్తుంది ఆ రింగ్టోన్ చప్పుడు అందరూ విని గోడ వైపు చూస్తారు కానీ భద్ర వెంటనే తప్పించుకుని వెళ్ళిపోతాడు. వసుధార ఎవరు లేరు మామయ్య కానీ ఆ రింగ్టోన్ ఎక్కడి నుండి వచ్చింది అంటూ ముగ్గురు కలిసి బయటికి వస్తారు భద్ర ఫోన్ మాట్లాడుతూ ఉండడం చూస్తారు. ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఏంటి సార్ మీకు టైం సెన్స్ కొంచెం కూడా లేదా అసలు ఈ టైం లో ఫోన్ చేశారేంటి అని అడుగుతాడు. శైలేంద్ర ఒరేయ్ భద్ర నువ్వు నాకు టైం సెన్స్ లేదంటావా అసలు నిన్ను చంపి పారేయాలనిపిస్తుంది అని అంటాడు. భద్ర చాలుగాని ఆపండి సార్ నేను సీక్రెట్గా వసుధార మహేంద్ర సర్ వాళ్ళు మాట్లాడుకుంటున్న విషయాలు వింటుంటే నువ్వు అప్పుడే ఫోన్ చేశావు మరి అలాంటి సమయంలో ఫోన్ వచ్చినప్పుడు ఇంకెలా మాట్లాడతారు చెప్పండి అని అంటాడు. శైలేంద్ర వావ్ వెరీ గుడ్ రా భద్ర నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు వాళ్ళు మాట్లాడుకునేది మొత్తం విని వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పు సరే ఉంటాను అని ఫోన్ కట్ చేస్తాడు శైలేంద్ర.
మహేంద్ర ఏ భద్ర ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావ్ అని అడుగుతాడు భద్ర ఏమి మాట్లాడడు వసుధార వెంటనే అతని చేతిలో ఉన్న ఫోన్ లాగేసుకొని ఇప్పుడు నీకు ఫోన్ వచ్చింది ఈ నెంబర్ నుండే నా అని అడుగుతుంది.భద్ర అవును మేడమ్ అని చెబుతాడు.వసుధర ఈ నెంబర్ కొత్త నెంబర్ల ఉందే ఇది శైలేంద్ర నెంబర్ కాదు అని మనసులో అనుకుంటుంది మహేంద్ర చెప్తావా లేదా నువ్వు ఫోన్ లో ఎవరితో మాట్లాడుతున్నావ్ చెప్పు అని అంటాడు. భద్ర అయ్యో అదేం లేదు సర్ వేరే రాంగ్ నెంబర్ వస్తే మాట్లాడుతున్నాను అని చెబుతాడు. మహేంద్ర అంతేనా ఇంకేమైనా ఉందా అని అంటాడు.భద్ర అంతే సార్ మీరు ప్రతిదానికి నన్ను ఇలా అనుమానిస్తే నేను ఇప్పుడే జాబ్ మానేస్తాను చెప్పండి మీకు నా మీద అనుమానం ఉంటే ఇప్పుడే చెప్పేయండి ఇప్పుడు ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని అంటాడు.మహేంద్ర సరే సరే గానీ వెళ్లి పని చూసుకో పో అంటాడు.
కట్ చేస్తే దేవయానికి వసుధార బావ రాజీవ్ ఫోన్ చేస్తాడు ఆ ఫోన్ శైలింద్ర లిఫ్ట్ చేస్తాడు హలో ఎవరు మాట్లాడేది అని అడుగుతాడు. రాజీవ్ మేడం జి నేను గుర్తు పెట్టలేదా అని అంటాడు. శైలేంద్ర నువ్వేమైనా విఐపియ్యవా గుర్తుపట్టడానికి రాంగ్ నెంబర్ కి ఫోన్ చేశావు అని అంటాడు. రాజీవ్ నేను కరెక్ట్ నెంబర్ కి ఫోన్ చేశాను అది దేవయాని మేడం దేనా ఫోను అని అడుగుతాడు. శైలేంద్ర అవును అంటాడు. అయితే వెళ్లి నోరు మూసుకుని మేడం జి కి ఫోన్ ఇవ్వురా అంటాడు.వీడెవడో ఈ శైలేంద్రకే తిక్క పుట్టిస్తున్నాడే అని అనుకుంటాడు.దేవయాని అప్పుడే వచ్చి ఏంటి నాన్న శైలేంద్ర ఫోన్లో ఎవరు అని అడుగుతుంది.శైలేంద్ర మామ్ ఎవడో రాంగ్ నెంబర్ ఫోన్ చేసి తిక్కతిక్కగా మాట్లాడుతున్నాడు అని చెబుతాడు. ఫోన్లో ఉన్న రాజువ్ దేవయాని గొంతు విని మేడం జి నేను రాజీవ్ ని గుర్తుపట్టలేదా అని అంటాడు.
దేవయాని ఏంటి రాజీవ్ రాజీవ్ ఎక్కడున్నావ్ నాన్న ఎలా ఉన్నావ్ అంటూ ఫోన్ లాగేసుకుని శైలేంద్రను నెట్టేసి మాట్లాడుతుంది దేవయాని. శైలేంద్ర మామ్ ఏంటి ఆ రాజీవ్ గాని పేరు వినగానే ఇంత ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతుంది అసలు ఆ రాజీవ్ అనేవాడు ఎవడు అని అనుకుంటాడు
రాజువ్ మేడం జి నేను మీతో అర్జెంటుగా మాట్లాడాలి ఎక్కడ కలుద్దాం అని అంటాడు. దేవయాని నువ్వు చెప్పు నాన్న ఎక్కడికి రమ్మంటావు అని అడుగుతుంది. రాజీవ్ సరే మేడం జి నేను చెప్పిన ప్లేస్ కి రండి అవును ఇంతకుముందు ఫోన్లో మాట్లాడింది ఎవరు అని అడుగుతాడు. దేవయాని అతను నా కొడుకు శైలేంద్ర అని చెబుతోంది.రాజీవ్ అయితే అతన్ని కూడా తీసుకొని రా అంటాడు. దేవయాని అలాగే ఇప్పుడే వచ్చేస్తాను అంటూ శైలేంద్ర నువ్వు కూడా పద అని అంటుంది. శైలేంద్ర మామ్ వాడెవ్వడినో కలవడానికి నేనెందుకు అంటాడు. శైలేంద్ర ఆ రాజీవ్ నిన్ను కూడా తీసుకొని రమ్మన్నాడు పదా అని అంటుంది. శైలేంద్ర దేవయాని ఇద్దరు కలిసి రాజీవ్ ని కలవడానికి రాజీవ్ చెప్పిన ప్లేస్ కి వెళతారు.
కట్ చేస్తే వసుధార రిషి ఫోటో చూస్తూ ఏంటి సార్ మనకి కర్మ అన్ని మనస్పార్ధాలు తొలగిపోయి మంచిగా కలిసి ఉందాం అనుకునే లోపు ఈ కష్టాలు వచ్చి పడుతున్నాయి నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను సార్ ఏం చేయాలి అర్థం కావడం లేదు అంటూ వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది వసుధార. వసుధార వాళ్ళ నాన్న హలో చెప్పమ్మా వసుధార ఏం చేస్తున్నావ్ అమ్మ ఎలా ఉన్నావ్ అని అడుగుతాడు.వసుధార నాన్న నేను బాగానే ఉన్నాను రిషి సార్ ఎలా ఉన్నారు ఏమైనా తింటున్నాడా అని అడుగుతుంది. వసుధారా నాన్న అల్లుడుగారు ఇప్పుడు భోజనం తింటున్నాడమ్మా కాస్త పరవాలేదు కొంచెం నయం అయింది అని చెబుతాడు వసుధారా సంతోషపడుతుంది ఒకసారి సార్ కి ఫోన్ ఇస్తావా నాన్న నేను మాట్లాడుతాను అంటుంది వసుధారణ అన్న అక్కడ సిగ్నల్ రావడం లేదమ్మా కావాలంటే నేను అల్లుడు గారి ఫోటో తీసి వీడియో రికార్డ్ చేసి పంపిస్తాను చూసుకో అంటాడు. వసుధార అలాగే నాన్న త్వరగా ఆ పని చేయి నాకు సార్ ని చూడాలి అనిపిస్తుంది అని చెబుతుంది
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!