Anushka: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పేరుగాంచిన నిర్మాణ సంస్థలలో యువి క్రియేషన్స్ బ్యానర్ ఒకటి. ఈ బ్యానర్ లో చాలా సినిమాలు నిర్మితమై బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. వంశీకృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి కలిసి 2013లో ఈ సంస్థను స్థాపించారు. ఈ బ్యానర్ లో కొరటాల శివ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా “మిర్చి” సినిమా చేయటం జరిగింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత రన్ రాజా రన్, జిల్, బలే బలే మగాడివోయ్, ఎక్స్ప్రెస్ రాజా, మహానుభావుడు, భాగమతి, హ్యాపీ వెడ్డింగ్, టాక్సీవాలా, సాహో వంటి సినిమాలు చేయడం జరిగింది.
2021లో ప్రభాస్ తో చేసిన “రాధే శ్యామ్” అతిపెద్ద డిజాస్టర్ సినిమాగా నిలిచింది. సినిమాలు నిర్మించడం మాత్రమే కాదు పలు సినిమాలు పంపిణీ కూడా ఈ సంస్థ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు హీరోయిన్ అనుష్కతో యువి క్రియేషన్స్ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా ప్లాన్ చూసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారట. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. హీరోయిన్ అనుష్క వరుస పరాజయాలతో గత ఏడాది మిస్టర్ అండ్ మిసెస్ పోలిశెట్టి సినిమాతో విజయం అందుకోవటం జరిగింది.
గతంలో ఇదే బ్యానర్ లో ప్రభాస్ నటించిన మిర్చి, భాగమతి సినిమాలో హీరోయిన్ గా అనుష్క చేసింది. దీంతో సబ్జెక్టు బాగుండటంతో పాటు కలిసొచ్చిన బ్యానర్ కావడంతో అనుష్క యువి క్రియేషన్స్ పతాకంపై సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. యువి క్రియేషన్స్ బ్యానర్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో “విశ్వంభర” అనే పాన్ ఇండియా సబ్జెక్టు సినిమా చేస్తున్నారు. చిరంజీవి కెరియర్ లోనే ఇది అత్యంత హైబడ్జెట్ మూవీ. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు ఈ సినిమా రిలీజ్ కానుంది. ఒకపక్క “విశ్వంభర” షూటింగ్ జరుగుతుండగానే మరోపక్క అనుష్క ప్రాజెక్టు కూడా మొదలు పెట్టడానికి యువి క్రియేషన్స్ బ్యానర్ సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!