టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జగన్నాథ్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. దూరదర్శన్లో అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించి పూరి జగన్నాథ్.. ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో అంచలంచలుగా ఎదుగుతూ డైనమిక్ డైరెక్టర్ గుర్తింపు పొందారు. అలాగే ఎందరో హీరోలకు స్టార్ స్టేటస్ ను అందించాడీయన.
అయితే కెరీర్ సక్సెస్ ఫుల్గా రన్ అవుతున్న సమయంలో అయినవారే మోసం చేయడంతో.. అప్పుల పాలై పూరి జగన్నాథ్ ఫ్యామిలీతో సహా రోడ్డు మీదకు వచ్చేశాడు. అదే సమయంలో వరుస ఫ్లాపులు కూడా ఆయన్ను వెంటాడాయి. ఆయన దర్శకత్వంలో హిట్ కొట్టిన హీరోలు కూడా పూరీని పట్టించుకోలేదు. అయినాసరే ఆయన వెనక్కి తగ్గలేదు.
తాను పడి లేచే కెరటాన్ని అని నిరూపించుకునేందుకు కథలపై కసరత్తు చేస్తూ ముందుకు సాగాడు. ఇక అలాంటి తరుణంలో వచ్చిన చిత్రమే `ఇస్మార్ట్ శంకర్`. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా పెట్టి ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. ఆ సినిమా షూటింగ్ మొదలు పెడదామనుకునే సమయానికి పూరి జగన్నాథ్ దగ్గర ఉన్నది కేవలం రూ. 75 వేలు మాత్రమేనట.
అయినప్పటికీ ఈ సినిమాను చేయాల్సిందే అన్న పట్టుదల, కసితో ఆయన రంగంలోకి దిగాడు. అనుకున్నట్లుగా సినిమాను తెరకెక్కించాడు. ఇక చివరకు ఏమైందో అందరికీ తెలిసిందే. 2019 జూలై 18న విడుదలైన `ఇస్మార్ట్ శంకర్` బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి బాక్సాఫీస్ వద్ద మాస్ కలెక్షన్స్ను రాబట్టింది. ఈ మూవీతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన పూరీ.. ఇప్పుడు `లైగర్` వంటి పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తే.. ఇక పూరి జగన్నాథ్కి తిరుగుండదనే చెప్పొచ్చు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!