Intinti Gruhalakshmi: అత్తయ్య ఏ మాటైనా మాట్లాడేటప్పుడు కాస్త శాంతంగా ప్రశాంతంగా మాట్లాడండి అని తులసి అనసూయమ్మకు సలహా ఇస్తుంది. నా జీవితం లో నుంచి నా భర్తని నాకు కాకుండా చేస్తున్నావు నువ్వు? అనసూయ ఇక్కడ నువ్వు ఏమి మాట్లాడకు సైలెంట్ గా ఉండు అని పరంధామయ్య అంటాడు. మీ ముద్దుల కూతురు గురించి నేను ఏమీ మాట్లాడకుండా ఉండాలి అంటే.. మీరు మర్యాదగా నాతో పాటు ఇంటికి వచ్చేయండి అని అనసూయమ్మ అంటుంది. మీరు రాకపోతే నేను ఏం చేస్తానో నాకు తెలియదు అంటూ అనసూయమ్మ పరంధామయ్యపై ఫైర్ అవుతుంది.. అడ్డం వచ్చిన తులసిని అనసూయమ్మ పక్కకు తోసేస్తుంది.
అనసూయమ్మ పరంధామయ్య పెళ్లి చేసుకున్నప్పటినుంచి పిల్లలు పెద్దయి వాళ్ల పిల్లలు పెద్దవాళ్ళు అయినంతవరకు పరంధామయ్య కష్టాన్ని ప్రతి విషయంలో వేలేత్తి చూపిస్తూ తన వల్లే ఈరోజు కుటుంబం అంతా సంతోషంగా ఉంటున్నారని.. నువ్వు ఏమీ చేతకాని వాడివని నీ చేతగానితనాన్ని నేను ఎప్పుడూ వేలెత్తి చూపించకుండా ఇన్ని రోజులు ఈ ఇంటిని నేను సరిదిద్దుతూ వచ్చాను. కానీ మీరు నాకు విలువ ఇవ్వడం లేదు అని అనసూయమ్మ పరంధామయ్యను గోంగూరలో పురుగులాగా తీసి పక్కన పడేస్తుంది. నువ్వు చేసినందుకుగాను నేను నీకు చాలా విలువైన బహుమతి ఇచ్చాను. అదే నా మౌనం నా నిశ్శబ్దం. అందరూ నన్ను భార్య మాట వినే భర్తగా నన్ను గుర్తించిన నేను ఏమీ మాట్లాడలేదు. నీ కష్టం విలువ నేను గుర్తించాను. కాబట్టే నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయానికి నేను ఏకీభవించాను అని పరంధామయ్య అంటాడు.
మీరంతా కలిసి నా ఇంటిని నాశనం చేశారు. నేను కూడా ఈ ఇంటిని నాశనం చేస్తాను అని తులసి ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ కింద పడేస్తుంది. అందరూ వద్దు వద్దు అని అంటూ ఉంటారు.. మీరు ఈరోజు నుంచి ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు అని తులసి వాళ్ళ ఇంట్లో నుంచి పరంధామైన తీసుకొని పరంధామయ్యను తీసుకుని అనసూయమ్మ వెళ్దాం రమ్మని పిలుస్తుంది. నేను ఎక్కడికి రాను అంటూ పరంధామయ్య ఉన్నచోటే కుప్ప కూలిపోతాడు. ఇక మీ నాటకాల ఆపండి పదండి ఇంటికి అని అనసూయమ్మ అంటుంది. అత్తయ్య ను అని అనసూయ మన సైలెంట్ గా ఉండమని వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తుంది తులసి.. ఇప్పటివరకు మీ కోపం చూపించారు. ఇక నా కోపం చూపించమంటారా అంటూ తులసి అనసూయమ్మ పై ఫైర్ అవుతుంది.
పరంధామయ్యను ఓ కూతురు లాగా చూసుకుంటానని అంటుంది. అమ్మ తులసి నువ్వు నన్ను చూసుకుంటావా ఇంకెప్పుడు నన్ను ఆ ఇంటికి పంపించావు కదా అని పరంధామయ్య అడుగుతాడు. పంపించను మావయ్య అని తులసి పరంధామయ్యకుమాటే ఇస్తుంది. నన్ను ఆయన ఒద్దును అనుకున్నప్పుడు ఆయనను కూడా నేను వద్దనుకుంటున్నాను అని అనసూయమ్మ ఇంకా దిగజారి మాట్లాడుతుంది. అందరూ కలిసి గంగలో దుకాని అని అంటుంది. మావయ్య మావయ్య అంటూ తులసి ఇల్లంతా వెతుకుతుంది. కానీ ఎక్కడా కనిపించడు. సామ్రాట్ తులసి ఇద్దరు కలిసి పరంధామయ్య కోసం వెతుకుతూ ఉంటారు. అటుగా వెళ్లారు అని చెబుతారు. ఇక ఏమవుతుందో తరువాయి భాగంలో చూద్దాం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!