Jagadhatri April 15 2024 Episode 205: జగదాత్రి వాళ్ళ అమ్మ ఫోటో ఇంట్లో ఉండడమే తప్పు అని రాగిణి తీసుకువచ్చి బయట పడేస్తూ ఉండగా కౌశికి ఆగు రాగిణి గారు తప్పు చేసిన నిషికను మందలించకుండా మీరు కూడా అలా చేస్తారేంటి అని అంటుంది. రాగిణి సర్ది చెప్పాలి కానీ మీరు ఎలా చేస్తే ఎలా చెప్పు అని వైజయంతి అంటుంది. ఇంకోసారి నిషికి ఇంట్లో అవమానం జరగకూడదు అని రాగిణి అంటుంది. జరగదులే అమ్మాయి కానీ మీ అమ్మాయి ట్రైనింగ్ పూర్తి అయిపోయిందా అని వైజయంతి అంటుంది. అయిపోయిందా అక్కగారు ఇక ఉద్యోగం రావడమే ఉంది యామిని వచ్చేస్తుంది అని వైజయంతి అంటుంది. హాయ్ జగదాత్రి ఎలా ఉన్నావ్ అని అడుగుతుంది యామిని . అందర్నీ ఏడిపించకు తినేది బాగానే ఉంటుందిలే అని రాగిణి అంటుంది. యామిని నీ దగ్గర ఉన్న గిఫ్ట్లు చాలా ఖరీదైనవి అనుకుంట ఎవరిచ్చారు అని నిషిక అడుగుతుంది. ఇవన్నీ మా సార్ వాళ్ళు కొనిచ్చారు అని యామిని చెబుతుంది. యామిని ఇంత ఖరీదు అయినవి కొనిచ్చారు అంటే వాళ్లు స్మగ్లర్స అని జగదాత్రి అంటుంది.ఇప్పటిదాకా ఏమీ అనలేదు అనుకున్నాను అనేసావా వాళ్ళ సార్ బాగా చదువుకుంటుందని ఇచ్చారు చూడలేకపోతున్నావా అని రాగిణి అంటుంది. చూద్దాం వాళ్ళ సార్ ఎవరో అని జగదాత్రి అనుకుంటుంది. కట్ చేస్తే,
జెడి యువరాజు వాళ్ళ ఇంట్లో ఉండి నా ప్లాంట్స్ అని నాకే తిప్పు కొడుతుంది ఆ జెడి టీవీని కనిపెట్టి వెంటనే షూట్ చేసి నాకు ఫోన్ చేయండి అక్కడ మిస్ అయితే నేను చూసుకుంటాను నేనే జెడి ని ఎటాక్ చేస్తానని తను ఊహించదు అని మీనన్ రౌడీలతో చెబుతాడు. అలాగే సార్ అని వాళ్ళు అంటారు. ఆఖరికి అది యువరాజైనా సరే సూట్ చేయండి అని మీనన్ చెబుతాడు. అవును అక్క నన్ను ఇంటర్వ్యూ కి మా సార్ వచ్చి తీసుకెళ్తానన్నారు అని యామిని చెబుతుంది. ఈ మీనన్ ఆట ఎలా ఉంటుందో చూపిస్తా అని అనుకుంటాడు.అమ్మ జగదాత్రి చానా రోజుల తర్వాత అందరంకలుసుకున్నాం కదా మంచి స్వీట్ చెయ్యి అని వైజయంతి అంటుంది. నేను వంట చేయను అత్తయ్య అని జగదాత్రి అంటుంది. పెద్దింట్లో ఉండగానే పొగరు తలకి ఎక్కిందా నేను చెప్తున్నాను వెళ్లి స్వీట్ రెడీ చెయ్ అని రాగిణి చెబుతుంది. అలాగే అని రాగిణి చెప్పగానే జగదాత్రి వంట చేయడానికి వెళుతుంది. ఇంతలో మీనన్ అక్కడికి వస్తాడు. యామిని వాళ్ళందరికీ పరిచయం చేస్తుంది. అక్కడే వంట చేస్తూ న జగదాత్రి అని చూస్తాడు మీనన్. తన కళ్ళను చూసి జగదాత్రిని గుర్తుపడతాడు. జగదాత్రి తన వంక అలా చూస్తూ ఉండగా ఇంతలో యువరాజు వచ్చి బాయ్ అని అంటాడు. యువరాజ్ అయన తెలుసా అని జగదాత్రి అంటుంది. దూరం నుంచి చూసి తెలిసిన వాళ్ళు అనుకున్నాను అని యువరాజ్ వెళ్ళిపోతాడు.
యామిని యువరాజ్ ని పరిచయం చేస్తుంది. ధాత్రి ఎవరు ఆయన అని కేదార్ అంటాడు. ఆయన యామిని వాళ్ళ ట్రైనింగ్ సార్ అంట అని జగదాత్రి సార్ కి మంచినీళ్లు తెచ్చి ఇస్తుంది.యామిని ఈ అమ్మాయి ఎవరు అని మీనన్ అడుగుతాడు. తను మా మామయ్య కూతురు జగదాత్రి అని యామిని పరిచయం చేస్తుంది. మీరు ఏం పని చేస్తారు అని జగదాత్రి అని అడుగుతాడు . స్కూల్లో పని చేస్తున్నాను అని జయదాత్రి అంటుంది. నైస్ మీరు మేము ఒకటే అనమాట అని మీనన్ అంటాడు. మీరు ఒకసార్ అయ్యుండి ఇన్నిటికి ఎలా చేస్తున్నారు సార్ ఇది కాక వేరే బిజినెస్ ఏమైనా చేస్తున్నారా అని జగదాత్రి అడుగుతుంది. ఇది కాకుండా సైడ్ బిజినెస్ ఉన్నాయి అని మీనన్ చెబుతాడు. మీ ఆఫీస్ ఎక్కడ సార్ అని జగదాత్రి అడుగుతుంది. బంజర హిల్స్రోడ్ నెంబర్ 3 బస్టాప్ ఎదురుగా అని మీనన్ చెబుతాడు. యామిని మనకు టైం అవుతుంది ఇక వెళ్దామా అని మీనన్ అంటాడు. అదేంటి మొదటి సారి మా ఇంటికి వచ్చారు మీరు బయట భోజనం చేయడానికి వీల్లేదు ఇక్కడ తినేసి వెళ్ళండి అని వైజయంతి అంటుంది. మీరు మరీ ఇబ్బంది పెడుతున్నారు అలాగే అని మీనన్ ఫోన్ మాట్లాడుకుంటూ బయటికి వెళ్లిపోతాడు. కట్ చేస్తే
కేదార్ నాకెందుకో అతని చూస్తే చాలా డౌట్ గా ఉంది అని జగదాత్రి అంటుంది. ధాత్రి నువ్వు అనుమానించాల్సిన అవసరమేముంది అతను యామిని వాళ్ళ సార్ కదా అని కేదార్ అంటాడు. తనని చూస్తుంటే మీనన్ మనిషేమోనని డౌట్ వస్తుంది అని జగదాత్రి అంటుంది. ధాత్రి అదంతా నీ అపోహ మీనన్ ఎక్కడ వీళ్ల సార్ ట్రైనర్ ఎక్కడ అని కేదార్ అంటాడు. అంతేనంటావా అని జగదాత్రి అంటుంది. కట్ చేస్తే,
బాయ్ మీరు యామిని వాళ్ళ ట్రైన్ ఏంటి భాయ్ అంతా నాకు అయోమయంగా ఉంది అని యువరాజ్ అంటాడు. యువరాజ్ నా సంగతి నీకు ఇంకా తెలియదు నేను సర్వంతర్యామిని కానీ మీ ఇంట్లో పోలీసులు ఉన్నారు అని మీనన్ అంటాడు. బాయ్ వచ్చి ఐదు నిమిషాలు కూడా కాలేదు ఎలా కనిపెట్టారు అని యువరాజ్ అంటాడు.నేను ఎంత చేస్తే ఇంతకు వచ్చానో నీకు ఇంకా అర్థం కాలేదు ఎలాగైనా సరే మీ ఇంట్లో ఉన్న అమ్మాయిని మాస్కి పెట్టుకునేలా చేయి తను పోలీసా కాదా అని కనిపెడతాను అని మీనన్ అంటాడు. అలాగే బాయ్ అని యువరాజ్ అంటాడు.ఒకవేళ ఆ అమ్మాయి జెడిఅయితే మీ అమ్మ వాళ్ళని తీసుకొని బయటికి వెళ్లి పో ఆ జెడి మీద బుల్లెట్ల వర్షం కురుస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ కి నేనంటే ఏంటో చూపిస్తాను అని మీనన్ అంటాడు. అలాగే బాయ్ తన పక్కనే ఉన్న కేదార్ ని కూడా వేసేయ్ అని యువరాజ్ అంటాడు. సరే ఇద్దరం కలిసి ఉంటామని పెళ్లిలో ప్రమాణం చేసుకున్నారు కదా చావులో కూడా కలిసే చేస్తారు అలాగే గేటు బయట దేవా ఉంటాడు అతను నీకు ఒక పార్సెల్ ఇస్తాడు చెప్పిన దగ్గర అపార్సులు ఇచ్చేసి రా అని మీనన్ చెప్పడంతో యువరాజ్ వెళ్ళిపోతాడు. జెడి నువ్వు ఏదో అనుకుంటున్నావు ఈరోజు నీకు చావును పరిచయం చేస్తా అని మీనన్ నవ్వుకుంటూ ఉంటాడు.కట్ చేస్తే,
నిషిక ఏ ధైర్యంతో నువ్వు వంట చేసి అందరికీ పెడతానని ఒప్పుకున్నావ్ అని యామిని అంటుంది. అదేంటి అలా అంటావు నేను వంట చేశాను కాచి నువ్వు చెప్పు అని అంటుంది నిషిక. అమ్మో నేను చెప్పలేను ఆరోజు వంట గురించి అని కాచి అంటుంది. నిషిక ఏదో ఆరోజు అలా చేసి ఉంటుంది కానీ తలుచుకుంటే ఏదైనా చేస్తుంది అని రాగిణి అంటుంది. యామిని జగదాత్రిని కేదార్ ని పిలుస్తుంది. వాళ్ళిద్దరికీ గిఫ్ట్ ఇస్తూ ఉండగా వాళ్లకెందుకే అని రాగిణి అంటుంది. అమ్మ నేను పెద్ద గిఫ్ట్ తీసుకురాలేదు నువ్వు తీసుకో అని లిఫ్టిక్ ని ఇస్తుంది యామని. మీ ఆవిడకే తీసుకువచ్చాను అనుకున్నావా అన్నయ్య నీకు కూడా తీసుకొచ్చానని తీస్తూ ఉండగా తన బ్యాగ్ కింద పడిపోతుంది అది చూసి జగదాత్రి ఇన్ని టాబ్లెట్లు ఉన్నాయి ఇవన్నీ నీ దగ్గర ఎందుకు ఉన్నాయి అని అడుగుతుంది జగదాత్రి. ఏమైందే అని రాగిణి కంగారు పడుతుంది. అమ్మ ఇవి నావి కావు అని యామిని అంటుంది..
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!