Karthikeya 2: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్, డైరెక్టర్ చందు మొండేటి కాంబినేషన్లో రూపుదుద్దుకున్న `కార్తికేయ` చిత్రం 2014లో విడుదలై ఎంత మంచి విజయం సాధించిందో ప్రత్యేకంగా వివరించి చెప్పాల్సిన పని లేదు. అయితే ఇప్పుడీ హిట్ మూవీకి `కార్తికేయ 2` టైటిల్తో సీక్వెల్ రాబోతోంది.
కార్తికేయ చిత్రంలో కలర్స్ స్వాతి హీరోయిన్గా నటిస్తే.. సీక్వెల్లో అనుపమ పరమేశ్వరన్ చేసింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జూలై 22న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇప్పటికే బయటకు వచ్చిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ మూవీపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఈ నేపథ్యంలోనే `కార్తికేయ 2`కి కళ్లు చెదిరే రీతిలో థియేట్రికల్ బిజినెస్ జరుగుతోందట. లేటెస్ట్ సమాచారం ప్రకారం.. ఈ మూవీకి థియేట్రికల్ రైట్స్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 14 కోట్ల నుంచి రూ. 20 కోట్లకు అమ్ముతున్నారని తెలుస్తోంది.
ఈ మూవీ బిజినెస్ చూసి ఏంటి సామి ఈ క్రేజు అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఏదేమైనా ఓ చిన్న హీరో సినిమాకు ఈ స్థాయిలో ఢీల్ కుదరమంటే సాధారణ విషయం కాదనే చెప్పాలి. కాగా, టి అడుగున రహస్యమైన ద్వారకానగరం ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, టాలీవుడ్ ఫేమస్ కమెడియన్ కమ్ హీరో శ్రీనివాస రెడ్డి, ప్రవీణ్, ఆదిత్యా మీనన్, తులసి, సత్య తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.