టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వీరి కాంబోలో వస్తోన్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఇప్పటికే వీరిద్దరూ `అతడు`, `ఖలేజా` చిత్రాల కోసం పని చేశారు. ఈ చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.
దీంతో వీరి హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలను నెలకొన్నాయి. `ఎస్ఎస్ఎమ్బీ 28` వర్కింగ్ టైటిల్తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. హారిక,హాసిని క్రియేషన్స్ నాగవంశీ నిర్మిస్తోన్న ఈ చిత్రం.. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లింది.
రామోజీ ఫిల్మ్ సిటీలో యాక్షన్ సీక్వెన్స్ తో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్గా మారింది. అదేంటంటే.. ఈ చిత్రంలో విలన్గా ఓ స్టార్ హీరో నటిస్తున్నాడట. అది కూడా బాలీవుడ్ స్టార్ హీరో అట.
ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు.. సైఫ్ అలీ ఖాన్. ఇప్పటికే త్రివిక్రమ్ సైఫ్ అలీ ఖాన్తో సంప్రదింపులు జరపడం.. ఆయన ఓకే చెప్పడం కూడా జరిగిపోయిందని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.
https://twitter.com/haarikahassine/status/1569317909071278080?s=20&t=nwG0hfOPexQwMvyqTwoZrg
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!