Malli Nindu Jabili December 14 2023 Episode 520: అవన్నీ పక్కన పెట్టండి మల్లిని చూడడానికి వెళ్లారు కదా ఆ సంగతి గురించి చెప్పండి అని శారదా అంటుంది. మేము వెళ్లేసరికి రాత్రి అంతా మల్లి బయటే ఉందమ్మ గారు అని మీరా అంటుంది. బయట ఉండక లోపలికి వెళ్తుందా ఇంక జీవితంలో గౌతమ్ తనని మళ్లీ క్షమించడు అని అంటుంది వసుంధర. కానీ గౌతమ్ బాబు గారు ఇంట్లోకి రానిచ్చారు అమ్మగారు అని మీరా చెప్తుంది. అదెలా సాధ్యం ఇంత జరిగిన వాడు ఇంట్లోకి రాణిచ్చాడు అని వసుంధర అంటుంది. నేనే బ్రతిమిలాడి ఒప్పించానమ్మ అని మాలిని అంటుంది. నేను చేసే దానికి నువ్వు చేసే దానికి ఏమైనా పొంతన ఉందా మాలిని అని వసుంధర అంటుంది. మా జీవితాలకి ఒక సొల్యూషన్ దొరకాలని ఇలా చేశాను మళ్లీ నువ్వు గతాన్ని తొవ్వి మమ్మల్ని పాడు చేయకు అని మాలిని అంటుంది.
కట్ చేస్తే, కౌసల్య బంధువులు ఇంటికి వస్తారు. అమ్మ ఇంట్లో లేదు ఏంటో చెప్పండి అంకుల్ అని గౌతమ్ అంటాడు. ఏమీ లేదు నిన్ను మల్లి నిన్ను మోసం చేసిందని తెలిసింది ఎలాగూ నా కూతురికి పెళ్లి అయ్యి ఆరునెల క్రితమే విడాకులు అయిపోయాయి నువ్వు మల్లి తోవిడాకులు తీసుకుంటావు కాబట్టి నా కూతుర్ని చేసుకో అని అతను అంటాడు. నాకు పని ఉంది ఇప్పుడు నేనేమీ మాట్లాడలేను మీరు వెళ్లిపోండి అని గౌతమ్ అంటాడు. నీకు మంచి భవిష్యత్తు ఉంది బాబు ఆలోచించు అని అతను అంటాడు. జీవితంలో మగాడికి భార్య ఒక్కతే అలాగే భార్యకి కూడా భర్త ఒక్కడే ఇదే నేను నమ్మిన సిద్ధాంతం ఇంకొక నిమిషం నా కళ్ళ ముందు ఉంటే ఏం చేస్తానో తెలియదు వెళ్లిపోండి అని గౌతమ్ గట్టిగా ఉంటాడు.అంటే దారుణంగా మోసం చేసిన ఈ మల్లి తోటే జీతం గడిపేస్తానంటావా అని వాళ్ళ అత్తయ్య అంటుంది. మీరు ఇంకొక క్షణం నా కళ్ళముందు ఉంటే సూట్ చేసి పారేస్తాను నా కళ్ళ ముందు నుంచి వెళ్లిపోండి అని గౌతమ్ అంటాడు.
చూడండి నేను మోసం చేశానని మీరేలా నిర్ధారిస్తారండి బంధువులు ఇలాంటి మాటలు చెప్పొచ్చా నా స్థానంలో మీ కూతురే ఉంటే ఇలాగే చేస్తారా విడిపోయిన భార్య భర్తని కలపడానికి ప్రయత్నించాలి కానీ ఇంకా దూరాన్ని పెంచాలనుకుంటారా మీరు అసలు మనుషులేనా మికు అసలు మనసు లేదా వెళ్లిపోండి ఇక్కడి నుంచి అని మల్లి అంటుంది. వాళ్లు వెళ్లిపోతారు. చూసావా నువ్వు చేసిన మోసానికి అందరూ ఇంటికి వచ్చి నా కూతురు ఎవరితోటో వెళ్లిపోయింది మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చింది పెళ్లి చేసుకుంటావా అని ఎగతాళి చేసినట్టు మాట్లాడుతున్నారు, నువ్వు రోడ్డు మీద పడి ఉంటే ఆఫీసుకు తీసుకువచ్చి ఉద్యోగం ఇచ్చి పెళ్లి చేసుకొని ఈ గొప్ప పొజిషన్లో నిన్ను నిలబెడితే నువ్వు నాకు ఏమి ఇచ్చావు నన్ను నడి రోడ్డు మీద నిలబెట్టావు అని గౌతమ్ కోపంగా అంటాడు. కళ్ళు లేని వాడు అందమైన లోకం చూడలేకపోయాను అని బాధపడతాడు కళ్ళు ఉన్న నేను నిన్ను చూడాల్సి వస్తున్నందుకు బాధపడుతున్నాను నా తలరాత ఏం చేయను అని గౌతమ్ అంటాడు. కొంతమంది ఆడపిల్లలు మాటలను తట్టుకోలేక అత్తవారింటి నుంచి వెళ్ళిపోతారు మరికొందరు గృహింస తట్టుకోలేక వెళ్ళిపోతారు ప్రతి ఆడపిల్ల జీవితంలో ఒక హద్దు అనేది ఉంటుంది ఆ హద్దు దాటితే తట్టుకోలేదు,నా విషయానికి వచ్చేసరికి మీరు నన్ను ఎన్ని మాటలు అన్నా కొట్టినా తిట్టినా సరే నేను ఇక్కడ నుంచి వెళ్ళను అని మల్లి తెగేసి చెబుతుంది.
నీ తప్పేమీ లేదు మల్లి నీ స్థానంలో వేరే ఆడపిల్ల ఉంటే తన తప్పు చెప్పుకునే పరిస్థితి కూడా ఇవ్వమని అడిగి ఉండేది కాదు అని మీ అంతట మీరే ఒప్పుకునేలా చేసి దాకా నేను మీకు దూరం కాను మీ నుంచి నన్ను దూరం చేసేది ఒక్క చావు మాత్రమే అని మల్లి ఏడుస్తుంది. కట్ చేస్తే, వసుంధర ఆలోచిస్తూ ఉంటుంది. ప్రీతి నీ వర్కింగ్ అయిపోలేదా అని స్రవంతి అంటుంది. లేదు స్రవంతి నైట్ షిఫ్ట్ కంటిన్యూ చేయాలి నువ్వు బయలుదేరు అని ప్రీతి అంటుంది. స్రవంతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో వసుంధర ప్రీతికి ఫోన్ చేస్తుంది. నేను చెప్పిన మ్యాటర్ గురించి ఏమైంది అని వసుంధర అంటుంది. ఇప్పుడే దాని గురించి టైప్ చేస్తున్నాను మేడం అని ప్రీతి అంటుంది. నువ్వు రాసే రాత మల్లి గౌతమ్ లో నుదుటి రాతలు మార్చేయాలి అని వసుంధర అంటుంది. సరే మేడం అని కంగారుపడుతూ ప్రీతి అంటుంది. ఎందుకు అలా కంగారు పడుతున్నావ్ అని వసుంధర అంటుంది.ఏ హాస్పిటల్ గురించి ఏ నేరం గురించి అయితే రాయొచ్చు కానీ ఇలాంటి విషయాలు రాయడం పెద్ద రిస్క్ మేడం అని ప్రీతి అంటుంది. దానికి పది లక్షలు ఇచ్చాను కదా మినిస్టర్ గారి గురించి పేపర్ లో పడేలా చేయి అని వసుంధర అంటుంది.
మినిస్టర్ గారి గురించి అలా రాస్తే పైగా ధర్మారావు అంత మంచివాడు కూడా కాదు ఈ ఆఫీస్ లోనే నన్ను తగలబెట్టేస్తాడు అని ప్రీతి అంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ పేరు బయటికి రాదు ఎవరు బలవలో వాళ్లే అవుతారు అర్థమైందా అని వసుంధర అంటుంది. అలాగే మేడం అని ప్రీతి అంటుంది. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే రేపు పేపర్లో ప్రింట్ అయ్యేదంతా మల్లి చేసినట్టుగానే ఉండాలి ఎల్లుండి న్యూస్ వచ్చి స్టేట్ అంట తెలిసిపోవాలి అని వసుంధర అంటుంది. అలాగే మేడం అని ప్రీతి అంటుంది. నీ పని నచ్చితే పదికి ఇంకో పది కల్పిస్తాంలే అని వసుంధర అంటుంది. ఓకే మేడం అని ప్రీతి పని మొదలు పెడుతుంది.
గౌతమ్ మల్లి కి పెళ్లయింది అన్న విషయం తెలిసి నువ్వు దాన్ని వెళ్ళగొడతావ్ అనుకున్నాను కానీ కరిగిపోయి ఎందుకు ఇంట్లో ఉంచుకున్నావో నాకు అర్థం కావట్లేదు అని వసుంధర అనుకుంటుంది. అందుకే ఇంకొక భాన0 విసరబోతున్నాను ఈ మేనత్తను తక్కువ అంచనా వేసావు కదూ గౌతమ్ అని వసుంధర అంటుంది. కట్ చేస్తే మల్లి కిచెన్ లో పాలు వేడి చేస్తుంది. గౌతమ్ ఆఫీస్ కి వెళ్తూ ఉండగా మల్లి పాలు తీసుకొచ్చి ఇస్తుంది. గౌతమ్ కోపంగా చూస్తాడు. వదిన తప్పు ఏమీ లేదని అర్థం అవుతుంది కానీ అన్నయ్య ఎలా రియాక్ట్ అవుతాడు అని నీలిమా అనుకుంటుంది.గౌతమ్ ఆ పాల గ్లాసులు తీసుకొని విసిరేస్తాడు కోపంతో.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?