Breaking: విశాఖపట్నం జగదాంబ సెంటర్ లోని ఇండస్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని మొదటి అంతస్తు ఆపరేషన్ ధియేటర్ లో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత మిగిలిన అంతస్తులకు పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని రెండు ఫైర్ ఇంజన్ లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఆసుపత్రిలోని సుమారు 40 మంది రోగులను అంబులెన్స్ లలో వివిధ ఆసుపత్రులకు తరలించారు.
అగ్నిప్రమాదంతో ఇండస్ ఆసుపత్రి ఆవరణలో దట్టమైన పొగలు వ్యాపించాయి. పై అంతస్తులోని ఎమర్జెన్సీ విభాగాల్లోని రోగులను ఫైర్ సిబ్బంది నిచ్చెనల సహాయంతో కిందకు తీసుకువచ్చారు. ఈ ప్రమాదంతో రోగులు, వారి బంధువులు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే ఈ అగ్ని ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.