NewsOrbit
political Politics ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Election Survey: ఏపీలో ఏ పార్టీకి ఎన్ని లోక్ సభ స్థానాలు వస్తాయంటే ..? టైమ్స్ నౌ, ఈటీజీ సర్వే లెక్క ఇదీ

ETG survey about lok sabha seats in Andhra pradesh

Election Survey: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా నాలుగైదు నెలల సమయం మాత్రమే ఉంది. అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్ మూడ్ లోకి వెళ్లిపోయాయి. అభ్యర్ధుల ఎంపికపై ప్రధాన రాజకీయ పక్షాలు దృష్టి సారించాయి. నియోజకవర్గాల ఇన్ చార్జిల చేర్పులు, మార్పులు చేస్తున్నాయి. రాజకీయ పార్టీల నాయకుల నుండి సామాన్య ప్రజల వరకూ వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి అనుకూలంగా ఫలితాలు ఉంటాయి అనే దానిపై చర్చ జరుగుతూనే ఉంది.

ETG survey about lok sabha seats in Andhra pradesh
ETG survey about lok sabha seats in Andhra pradesh

మరో పక్క సర్వే సంస్థలు కూడా ప్రజల నాటి ఎలా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయన్న దానిపై ప్రముఖ జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ, ఈటీజీ సంస్థలు తాజాగా సర్వే నిర్వహించారు. ఆ సర్వే సంస్థ వెల్లడించిన అంచనాల ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ సీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని వెల్లడించింది.

రాష్ట్రంలోని 25 లోక్ సభ స్థానాల్లో 24 – 25 సీట్లను ఆ పార్టీ కైవశం చేసుకుంటుందని ప్రకటించింది. ఫ్యాన్ గాలికి టీడీపీ, జనసేన, బీజేపీ, ఇతర పక్షాలు ఎగిరిపోవడం ఖాయమన్నట్లుగా స్పష్టం చేసింది. టీడీపీకి గరిష్టంగా ఒక స్థానం దక్కే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది. ఇక బీజేపీ, జనసేన  ఒక్క స్థానంలోనూ గెలవలేదని పేర్కొంది. గతంలో వెల్లడైన పలు సర్వే సంస్థల అంచనాలు ఇందుకు భిన్నంగా ఏమీ లేవు. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తొంది.

ETG survey about lok sabha seats in Andhra pradesh
ETG survey about lok sabha seats in Andhra pradesh

ఏపీలో 2019 ఎన్నికల్లో 22 లోక్ సభ స్థానాల్లో విజయం సాధించిన వైసీపీ .. ప్రస్తుతం మరింత బలపడిందని స్పష్టం అవుతోంది.  గత అయిదేళ్లలో సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు, సుపరిపాలనతో వైసీపీకి ప్రజాదరణ పెరిగిందని, ఈ కారణంగానే వైసీపీకి 22 స్థానాల నుండి 25 లోక్ సభ స్థానాల్లోనూ క్లీన్ స్వీప్ చేసే స్థాయికి చేరుకుందని విశ్లేషించింది.

ETG survey about lok sabha seats in Andhra pradesh
ETG survey about lok sabha seats in Andhra pradesh

జాతీయ స్థాయిలోనూ బీజేపీ ప్రభంజనం ఉన్నట్లుగా ఈ  సర్వే వెల్లడించింది. మొత్తం లోక్ సభలో 543 స్థానాలకు గానూ బీజేపీ 308 నుండి 328 స్థానాలు కైవశం చేసుకునే అవకాశం ఉందని తెలిపింది. కాంగ్రెస్ 52 – 72 స్థానాలకే పరిమితం అవుతుందని చెప్పింది. మూడో అతి పెద్ద పార్టీ గా వైఎస్ఆర్ సీపీ నిలవనుందని చెప్పింది. డీఎంకే, టీఎంసీలు 20 నుండి 24 స్థానాలు, బీజేడీ 13 నుండి 15, బీఆర్ఎస్ 3 – 5, ఏఏపీ 4 – 7, ఇతరులు 66 నుండి 76 స్థానాలు కైవశం చేసుకోవచ్చని సర్వే వెల్లడించింది.

 

Related posts

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju