Malli Nindu Jabili December 20 2023 Episode 525: నిన్ను నేను ఫాలో అయ్యాను అమ్మకు ఒంట్లో బాగోలేదని అబద్ధం చెప్తావా అని గౌతమ్ తన పీక పిసక పోతాడు. ఏవండీ నేను చెప్పేది నిజమండి ఆఫీసులో అని మల్లి ఏడుస్తుంది. వాన్ని మర్చిపోలేకపోతే వాడితో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చుగాచి చి నీ మొహం నాకు చూపించకు అంటూ కోపంగా లోపలికి వెళ్లి డోర్ పెట్టుకుంటాడు గౌతమ్. ఏమండీ నేను చెప్పేది నిజమండి అని ఏడుస్తూ మల్లి డోర్ దగ్గరే కూర్చుంటుంది. కట్ చేస్తే, మల్లి వచ్చి నిజం చెప్పింది కాబట్టి నువ్వు సేఫ్ అయ్యావు లేదంటే ఆ ధర్మారావు ఏం చేసేవాడు ఏమో వాడి గురించి చెడుగా పేపర్లో విన్నాను కానీ ఆ న్యూస్ ఎలా మారిపోయిందో ఏమో అని శరత్ అంటాడు. అరవింద్ ఇక్కడ ఏం జరిగినా నేను మీ మామయ్య చూసుకుంటాం మీరు బయలుదేరండి అని వసుంధర అంటుంది. ఈ న్యూస్ పేపర్ లో వచ్చినందుకు గౌతమ్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది తన ఛానల్ కి తనకి పెద్ద దెబ్బ తగులుతుంది అని శరత్ అంటాడు.
అలా దెబ్బ తగలాలనే కదా పగడ్బందీగా ప్లాన్ చేశాను అని వసుంధర అనుకుంటుంది. మల్లి కి గౌతమ్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని మాలిని అంటుంది. అంత సింపుల్ గా క్లోజ్ అయిపోతే నేనెందుకు అగ్గిపుల్ల ని పెట్టి వెలిగిస్తాను రేపు తెల్లారేసరికి ఆ గౌతమ్ గాడి ఆఫీస్ ఇల్లు తగలబడిపోతుంది అని వసుంధర అనుకుంటుంది. ఇలా వెళ్లడం కరెక్ట్ కాదనిపిస్తుంది మామయ్య అని అరవింద్ అంటాడు. ఏదైనా అవసరం ఉంటే నేను పిలిపిస్తాను అరవింద్ నువ్వు బయలుదేరు అని శరత్ అంటాడు. వసుంధర అల్లుడ్ని కూతుర్ని వైజాగ్ పంపించేస్తుంది.కట్ చేస్తే న్యూస్ పేపర్ అంతా సిటీ ప్రచారం అయిపోతుంది. ఆ పేపర్ ధర్మారావు కూడా చదువుతాడు రేయ్ ఎవడ్రా నా మీద ఇలాంటి న్యూస్ రాసింది వాడి ఇల్లు ని ఆఫీస్ ని తగలబెట్టండి అని ధర్మారావు అంటాడు. ఐ క్యు న్యూస్ ఛానల్ గౌతమ్ నంద సార్ అని అతని దగ్గర పని చేసే ఒక వ్యక్తి అంటాడు. సార్ ఇప్పుడు మనం ఆ పని చేస్తే ఇంకా మీరు చెడ్డవారైపోతారు సార్ అలా కాకుండా వేరే మార్గం చూడండి అని రౌడీ అంటాడు.
అయితే డిఐజి కి ఫోన్ కలపరా అని ధర్మారావు అంటాడు. ఇదిగో డిఏజి పేపర్ చదివావా వాడి ఇల్లు ఆఫీసు తగలబెట్టేస్తాను నువ్వు మా వాళ్ళ జోలికి రావద్దు అని అంటాడు ధర్మారావు.సార్ ఇప్పుడే ఆ పేపర్ చదివాను కానీ మీరు అలా చేస్తే మీకు చెడ్డ పేరు వస్తుంది సార్ నేను చూసుకుంటాను అని డి ఐ జి అంటాడు. మా వాళ్ళు అల్లరి చేస్తున్నట్టు ఎక్కడైనా కనిపిస్తే చూసి చూడనట్టు వదిలేయండి సార్ అని ధర్మారావు అంటాడు. నా గురించి న్యూస్ రాసింది ఎవడైనా సరే చావాల్సిందే చట్టం పని చట్టం చేస్తుంది నా పని నేను చేయాల్సిందే అని ధర్మరావు కోపంగా అంటాడు. కట్ చేస్తే, మల్లి డోర్ బయట కూర్చుని ఉంటుంది. ఇంతలో పేపర్ అతను వచ్చి వాళ్ళ ఇంటి ముందు పేపర్ వేసి వెళ్ళిపోతాడు. ఆ పేపర్ ని చూసిన మల్లి షాక్ అయిపోతుంది. ఇంతలో కౌసల్య డోర్ తీసి పొద్దు పొద్దున్నే నీ మొహం చూస్తే అసహ్యం వేస్తుంది అని అంటుంది. అత్తయ్య అని మల్లి అంటుంది. నన్ను అలా పిలవక ని ఎన్నిసార్లు చెప్పాను అని కౌసల్య అంటుంది.
అత్తయ్య నేను ఆయనతో మాట్లాడాలి పేపర్ చూపించాలి అని మల్లి అంటుంది. ఇంతలో పబ్లిక్ అంత వచ్చేసి రేయ్ గౌతమ్ మినిస్టర్ గారి గురించి తప్పుడు రాతలు రాస్తావా బయటికి రారా అని అరుస్తూ రాళ్లు విసురుతూ ఉంటారు. మల్లి వాళ్ళని తీసుకొని లోపలికి వెళ్లి డోర్ పెట్టుకుంటుంది. ఏమైంది ఎందుకు అందరూ రాళ్లు విసురుతున్నారు అని కౌసల్య అంటుంది. అందరూ అరుస్తూ ఉంటారు వాళ్ళ అరుపులు విన్నా గౌతమ్ బయటికి వస్తాడు. కట్ చేస్తే, ధర్మారావు పోలీసులని తీసుకుని ఆఫీస్ మీదకి వెళ్తాడు. గౌతమ్ కోపంతో కిందికి వస్తాడు. గౌతమ్ నువ్వు అలా బయటికి వెళ్ళకు పరిస్థితి ఏమి బాగోలేదు ముందు పేపర్ చూడు అని కౌసల్య అంటుంది. ఆ పేపర్ చూసిన గౌతమ్ షాక్ అయిపోతాడు. అక్కడ ధర్మారావు ఆఫీసులో స్టాఫ్ నందర్నీ కొడుతూ అల్లరి చేస్తూ ఉంటాడు. మీసాలు ఎక్కడో చూపించరా అని ఒక అతన్ని తీసుకుని బయలుదేరుతాడు ధర్మారావు.ఈ న్యూస్ మన పేపర్లో ఎలా వచ్చింది అని గౌతమ్ అంటాడు. ఇంతలో కీర్తి ఫోన్ చేసి సార్ ఆ ధర్మారావు వచ్చి మన ఆఫీస్ స్టాఫ్ నంతా కొట్టి మీ దగ్గరికి బయలుదేరాడు సార్ అని చెప్తుంది. ఇంత పెద్ద న్యూస్ మన పేపర్లో ఎలా పడింది అని కోపంతో రగిలిపోతాడు గౌతమ్. కట్ చేస్తే, మాలిని అరవిందు వైజాగ్ చేరుకుంటారు.
అసలు పేపర్ లో ఏం పడిందో చూడాలి అని లాప్టాప్ లో వార్తలు పెట్టుకుంటాడు అరవింద్. ఆ న్యూస్ చూసి షాక్ అయిపోతాడు అరవింద్.ఇంత పెద్ద మిస్టేక్ ఎలా జరిగింది నేను కవర్ చేసిన ఆర్టికల్ అయితే పక్క ఆధారాలు ఉండేవి నాకు తెలియకుండా దీనికి నేను బాధ్యునైపోయాను చాలామందికి ఎఫెక్ట్ అవుతుంది మినిస్టర్ ధర్మారావు మనుషులతో ఎటాక్ చేస్తాడు అని అరవిందు టెన్షన్ పడుతూ ఉంటాడు. అక్కడ సిచువేషన్ ఎలా ఉందో అమ్మాయికి ఫోన్ చేసి కనుక్కుంటాను అని మాలిని వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది. ఇక్కడ ఎలాంటి హడావుడి లేదు మాలిని అలాంటిదేమైనా ఉంటే నేను ఫోన్ చేసి చెప్తాను మీరు వారం రోజులు అక్కడే ఉండి ఎంజాయ్ చేసి రండి అని వస్తుందా అబద్ధం చెప్తుంది.
అరవింద్ వస్తానన్న ఇక్కడికి రానివ్వకు ఏదైనా ఉంటే నేను మేనేజ్ చేస్తాను అని వసుంధర అంటుంది. అక్కడ అంతా బాగానే ఉందంట అరవింద్ అని మాలిని అంటుంది. మినిస్టర్ ధర్మారావు గురించి నాకు తెలుసు మాలిని అతను రాసిన వాడిని వదిలిపెట్టడు ఛానల్ మీద పడి ఎంత గొడవ చేస్తున్నాడో ఏమో అని అరవింద్ అంటాడు. నువ్వేం టెన్షన్ పడకు అరవింద్ అక్కడ అంత కూల్ గానే ఉంది అని మాలిని అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ మువిస్తుంది
Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?