Bigg Boss 7 Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ షో అద్భుతంగా జరిగింది. సీజన్ సెవెన్ టైటిల్ కోసం మొత్తం 19 మంది పోటీపడ్డారు. 105 రోజులు పాటు జరిగిన ఈ షోలో ప్రేక్షకులు ఊహించని ట్విస్టులు.. కంటెస్టెంట్లు అనుకోని షాక్ లు నిర్వాహకులు ఇవ్వడం జరిగింది. ఏకంగా ఐదుగురు సభ్యులు వైల్డ్ కార్డు రూపంలో ఎంట్రీ ఇచ్చారు. ఎలిమినేట్ అయిపోయిన రజక మళ్ళీ హౌస్ లోకి వచ్చి గేమ్ ఆడింది. ఎన్ని జరిగినా కానీ చివర ఆఖరికి పల్లవి ప్రశాంత టైటిల్ గెలవడం జరిగింది. ఇక్కడదాకా అంతా బాగానే ఉన్నా గాని గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ముగిసిన అనంతరం అన్నపూర్ణ స్టూడియో బయట గొడవలు జరగడం తెలిసిందే.
ఈ గొడవలలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కార్లు ధ్వంసం అయ్యాయి. బిగ్ బాస్ రన్నర్ అమర్ దీప్ పై దాడులు అతని కారు అద్దాలు పగలగొట్టడంతోపాటు అమర్ తల్లి మరియు భార్యపై కూడా రాళ్లు విసిరిన సందర్భాలు ఉన్నాయి. బోలె కారు కూడా ధ్వంసం అయ్యే పరిస్థితి నెలకొంది. బయట అల్లరి మూకలు చేసిన దాడులకు… ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం కావడం జరిగాయి. దీంతో పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది. రూల్స్ కి వ్యతిరేకంగా ర్యాలీ చేయడంతో పాటు వాహనాలపై దాడి జరగడంతో సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు కావటం జరిగింది. ఇదిలా ఉంటే ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం కావటం పై తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్ బిగ్ బాస్ షో నిర్వహకులపై మండిపడ్డారు.
ఇదే సమయంలో నాగార్జునపై కూడా సీరియస్ పోస్ట్ సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఎదురవుంటే తాజాగా ఈ గొడవ పట్ల హోస్ట్ నాగార్జుననీ అరెస్టు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. బిగ్ బాస్ షో పేరుతో అక్రమంగా వంద రోజులు నిర్బంధించటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అడ్వకేట్ అరుణ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ లో బిగ్ బాస్.. షోలో పాల్గొన్న వారిని సైతం విచారించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఆర్టీసీ ఆస్తులను ధ్వంసం చేయడం వెనకాల కుట్రను బయటకు తీయాలని పిటీషనర్ న్యాయస్థానాన్ని కోరారు.