Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ అనంతరం దాడులు తెలుగు మీడియాలో సంచలనంగా మారాయి. బిగ్ బాస్ హౌస్ లో కామన్ మ్యాన్ గా గేమ్ ఆడిన పల్లవి ప్రశాంత్ గెలవడం తెలిసిందే. హౌస్ లో ప్రశాంత ఆట తీరు అంతా బాగానే ఉంది. శివాజీ సపోర్ట్ తో చాలా వర్క్ కంట్రోల్ గేమ్ ఆడి టైటిల్ గెలుచుకున్నాడు. కానీ టైటిల్ గెలిచిన తర్వాత ప్రశాంత్ మీడియాతో మాట్లాడిన తీరు ఇంటికి వెళ్లిన తర్వాత ఇంటర్వ్యూ ఇస్తానని అందరినీ వెయిట్ చేయించి తర్వాత దుర్భాషలాడటం అతని పట్ల తీవ్ర నెగెటివిటీ తీసుకొచ్చేసింది. ముఖ్యంగా అన్నపూర్ణ స్టూడియో బయట ప్రశాంత అభిమానులు ఇతర బిగ్ బాస్ కంటెస్టెంట్ లపై దాడులకు పాల్పడటం .. అద్దాలు ధ్వంసం చేయడంతో కేసు నమోదు కావడం జరిగింది.
పోలీసులు ర్యాలీలు చేయొద్దని హెచ్చరించినా గానీ అన్నపూర్ణ స్టూడియో నుండి బయటికి వెళ్లిపోయిన ప్రశాంత్ మళ్లీ వెనక్కి రావడం… ర్యాలీ చేయడంతో అతనిపై కేసు నమోదు అయ్యింది. అతనితోపాటు కారు నడిపిన డ్రైవర్ల పై కూడా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామాలతో పల్లవి ప్రశాంత్ పరారీలో ఉండటం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే పల్లవి ప్రశాంత్ తరుపున హైకోర్టు లాయర్ రాజేష్ కుమార్ స్పందించారు. కావాలని ప్రశాంత్ ని టార్గెట్ చేశారని మండిపడ్డారు. కక్ష సాధింపు చర్యలు తగవు అని అన్నారు.
అతనిపై నమోదైన కేసు ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వటం లేదు. ఈ కేసుల వల్ల భయపడి ప్రశాంత్ పరారీలో ఉన్నాడు. ఎలాంటి కేసు అయినా ఎఫ్ఐఆర్ పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. ఎఫ్ఐఆర్ ఉంటేనే అతడికి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే బెయిల్ కోసం ఇంకా దరఖాస్తు చేయలేదు అని ప్రశాంత్ లాయర్ వ్యాఖ్యానించారు. బిగ్ బాస్ షో నడిచేంతవరకు ప్రశాంత్ పై బయట జనాలకు ఒక మంచి అభిప్రాయం ఉండేది. కానీ విజేత అయ్యాక అతడు ప్రవర్తిస్తున్న తీరు.. అతడికి చాలా నెగెటివిటీ బయట తీసుకొస్తూ ఉంది.