Mamagaru: మీ తెలివితేటలు నా మీద చూపించకండి అంటూ గంగా వెళ్ళిపోతుంది. అమ్మో బ్రహ్మ దేవుడా ఈ ఆడవాళ్లను అర్థం చేసుకోవడం మన వల్ల కాదు అని గంగాధర్ అనుకుంటాడు. కట్ చేస్తే, పాండురంగ బెడ్ షీట్ తీసుకొని మందు తీసుకొని ఒక చెట్టు దగ్గర కూర్చొని మూసుకుని తాగుతూ ఉంటాడు. రేయ్ రంగా హాయిగా మందు తాగుతూ శ్రీలక్ష్మి ని చూస్తూ సైట్ కొడుతూ ఇంట్లో ఉండగా ఏంట్రా నీ బతుకు ఇలా తగలడింది ఆడవాళ్లు ఉద్యోగాలు చేస్తే ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని నాన్న ముందే చెప్పాడు వినిపించుకోలేదు ఈ పరిస్థితికి దిగజారిపోయాం అంటూ పాండురంగ మందు తాగుతూ ఉంటాడు. ఇంతలో సుధాకర్ అటుగా వెళుతూ రేయ్ పాండురంగ నాకు కూడా కొంచెం మ0దు పోయారా అని అంటాడు. అన్నయ్య నువ్వు ముందు ఇలాగే అంటావు ఇంట్లో శ్రీలక్ష్మి టార్చర్ తట్టుకోలేక మందు తాగుతున్నాను అని పాండురంగ అంటాడు. నాది కూడా అదే పరిస్థితి రా పోయి అని సుధాకర్ అంటాడు. వాళ్ళిద్దరూ కలిసి మందు తాగుతారు. రేయ్ పాండురంగ ఈ ఆడవాళ్ళ మధ్య గొడవ తేల్చలేకపోతున్నాం ఏదో ఒక ఐడియా చెప్పరా అని సుధాకర్ అంటాడు. నా దగ్గర ఒక ఐడియా ఉంది అన్నయ్య అని ఒకటి రెండు మూడు అని లెక్క పెట్టి నిద్రపోతాడు పాండురంగ. వీడు ప్లాన్ తోటే బెడ్ షీట్ కూడా తెచ్చుకొని మందు తాగాడు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని సుధాకర్ అనుకుంటాడు. కట్ చేస్తే,
ఇంతలో తెల్లవారింది గంగా అందరికీ కాఫీ తీసుకొచ్చి ఇచ్చి చిన్న బావ రాలేదా బావగారు అని అడుగుతుంది. ఆ విషయం మమ్మల్ని ఎందుకు అడుగుతావు గంగ అని వసంత అంటుంది. గంగా పాండురంగకి కాఫీ ఇస్తుంది శ్రీలక్ష్మి కూడా కాఫీ ఇస్తుంది. శ్రీలక్ష్మి కాఫీ తీసుకొని వెళ్లి డోర్ పెట్టుకుంటుంది. పాండురంగ కాఫీ తాగుతూ వచ్చి సోఫాలో కూర్చుని అన్నయ్య ఏంటి పరిస్థితి వదిన కోపం తగ్గిందా అని అడుగుతాడు. లేదురా సేమ్ డిట్టో ఇద్దరు ఒకేలాగా ఉన్నారు అని సుధాకర్ అంటాడు. కట్ చేస్తే,
చంగయ్య స్నానం చేసి వచ్చి భగవంతుడికి దండం పెట్టుకొని వచ్చి దేవమ్మ టిఫిన్ పెట్టు త్వరగా బయటికి వెళ్లాలి అని అంటాడు. అలాగేనండి అని దేవమ్మ కిచెన్ లోకి వెళుతుంది. టిఫిన్ చేయలేదు అని వసంత కిచెన్ లోకి వెళ్ళగానే శ్రీలక్ష్మి అక్కడికి వస్తుంది శ్రీ లక్ష్మక్క కొంచెం టిఫిన్ చేసి పెట్టావా నాకు పనుంది అని అంటుంది. నీ డ్యూటీ నేనెందుకు చేయాలి అని శ్రీలక్ష్మి అంటుంది. అదేంటి అక్క నీ పని నా పని అంటావ్ కలిసి పని చేసుకుంటే తప్పేముంది అని వసంత అంటుంది. నేను చేయడం కుదరదాకా ఎవరి పని వాళ్ళే చేయాలి అంటూ శ్రీ లక్ష్మీ వెళ్ళిపోతూ ఉండగా మంచి వాడి గుణం మాంసం దగ్గర తెలుస్తుంది ఇంత చిన్న పనికి సామెతలు చెబుతుంది అంటూ వసంత టిఫిన్ చేస్తుంది. కట్ చేస్తే,
వసంత తీసుకువచ్చి టిఫిన్ అందరికీ పెడుతుంది. ఏవండీ చట్నీవేమంటారా అని వసంత సుధాకర్ ని అడుగుతుంది. శ్రీ లక్ష్మి టక్కన తీసుకొని వాళ్ళ ఆయనకి చట్నీ వేస్తుంది. కారంపొడి వేసుకుంటారా మామయ్య గారు అని వసంత అడుగుతుంది. వద్దమ్మా మంటగా ఉంటుంది అని చంగయ్య అంటాడు. నెయ్యి వెయ్యకుండా కారం పొడి తింటే మండుదా మరి అని శ్రీలక్ష్మి అంటుంది. శ్రీలక్ష్మి నీ ట్యూషన్ నీ పిల్లలు ఎలా ఉన్నారు నీ మాట వింటున్నారా అని అడుగుతాడు చంగయ్య. బాగానే చదువుతున్నారనుకుంటున్నాను మామయ్య గారు ఎంత చెప్పితే ఏం లాభం సొంత బుద్ధి ఉండాలి కదా అని శ్రీలక్ష్మి అంటుంది. అవును చదవాలని వాళ్ళకు ఉండాలి కానీ నువ్వేం చేస్తావు లే అని చంగయ్య,యమ్మ శ్రీలక్ష్మి నీ లాయర్ ఉద్యోగం ఎలా ఉంది అని అడుగుతాడు. తనకేంటి నాన్న మూడు కేసులు ఆరు వాయిదాలు అన్నట్టు బాగానే నడుస్తుంది అని సుధాకర్ అంటాడు. నిన్ను అడగలేదు కదరా నిన్ను అడిగినప్పుడు నువ్వు చెప్పు చెప్పమ్మా వసంత నీ కోర్టులు వాదించడానికి కేసులు ఎలా ఉన్నాయి అని చంగయ్య అంటాడు. బాగానే ఉన్నాయి మామయ్య గారు అన్ని ఒప్పుకోవట్లేదు ఒక కేసులోనే గెలవాలని చూస్తున్నాను అని వసంత అంటుంది. అవతల వాడు కూడా గెలవాలని అనుకుంటాడు కదామ్మ అని చంగయ్య అంటాడు. ఓడిపోవాలని ఎవడు అనుకుంటాడు నాన్న అని పాండురంగ అంటాడు. సుయ్యిమంటే నాకు ఒక బూరేని నువ్వు ఎందుకురా వస్తావ్ నిన్ను అడిగినప్పుడు సమాధానం చెప్పు అమ్మ చిన్న కోడలా సాఫ్ట్వేర్ ఉద్యోగం ఎలా ఉంది అని అడుగుతాడు. బాగానే ఉంది మామయ్య గారు అని గంగా అంటుంది.కొత్తలో బాగానే ఉంటుంది అమ్మ కొత్త అందం పాత రోత అని ముందు ముందు తెలుస్తుందిలే అని చంగయ్య అంటాడు. అలా అన్న చ0గయ్య వాళ్ళ ముగ్గురిని గమనించి తను అతికించిన బోర్డు వంక చూసి నా ప్రయత్నం నేను చేస్తున్నాను అని అనుకుంటాడు. కట్ చేస్తే,
మహేష్ గంగాధర్ అంజమ్మ వాళ్ళ టిఫిన్ బండి దగ్గరికి వచ్చి టిఫిన్ చేస్తారు. అల్లుడుగారు ఒక అబ్బాయిని చూడమన్నాను కదా ఇబ్బంది అయిపోతుంది ఎవరైనా దొరికారా అని వెంకటరమణ అడుగుతాడు. ఐదు నిమిషాలు ఆగండి మామయ్య గారు అదే పనిలో ఉన్నాను అని గంగాధర్ మహేష్ దగ్గరికి వెళ్లి ఫోన్ తీసుకొని పక్కన పెట్టేసి రేయ్ మామయ్య గారికి 200 టిఫిన్ కట్టమని ఆర్డర్ వచ్చిందంట పాపం ఎవ్వరూ పని వాళ్ళు దొరకట్లేదు దొరికిన డబ్బులు అడుగుతున్నారు అంట అని గంగాధర్ అంటాడు. రేయ్ ఎవరో ఎందుకురా మనమే ఉన్నాను కదా మనం చేద్దాంలే అని మహేష్ అంటాడు. నేను ఇంటి అల్లుని కదరా చేస్తే ఫీల్ అవుతారు అని గంగాధర్ అంటాడు. అయితే నేనున్నాను కదరా నేను చేస్తాను అని మహేష్ చేయి కడుక్కొని వచ్చి అంకుల్ ఏం చేయాలి అని అడుగుతాడు. 200 టిఫిన్లు కట్టాలి బాబు అని వెంకటరమణా చెబుతాడు. నేను చేస్తాను మీరేం టెన్షన్ పడకండి అంకుల్ మహేష్ అంటాడు. సరే మామయ్య నేను వెళ్లి వస్తాను అని గంగాధర్ వెళ్తూ ఉండగా రేయ్ ఎక్కడికి వెళ్తున్నావ్ రా అని మహేష్ అడుగుతాడు.
నాకు కొంచెం పని ఉంది రా నువ్వు కానీ అని గంగాధర్ అంటాడు. మామయ్య గారుపని అంత అయిపోయిన తర్వాత సాయంత్రం రే0డు వ0దలు ఇస్తాడు కదా వాటితో పెగ్గు కొట్టి పడుకుంటాను అని మహేష్ అనుకుంటాడు. మామయ్య గారు మహేష్ పని చేశాడని 200 ఇవ్వకండి వాడు పనోడు కాదు మనవాడు ఫీల్ అవుతాడు అని గంగాధర్ వెళ్ళిపోతాడు. దుర్మార్గుడా మామయ్య గారు 200 ఇస్తే మందు తాగుదాం అనుకుంటే అవి కూడా ఇవ్వొద్దంటావా అని మహేష్ ఫీలవుతాడు.కట్ చేస్తే,
పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. సుధాకర్ వాళ్ళ పిల్లల్ని స్కూలుకి పంపిస్తూ ఉండగా పిల్లల్ని చూసి ఏంట్రా స్కూల్ కి వెళ్లలేదు అని అడుగుతాడు. మా అమ్మ స్కూల్ కి వెళ్లొద్దని చెప్పింది అని పిల్లలు అంటారు..
Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?