Madhuranagarilo: అక్కడికి వస్తే నువ్వు బాధ పడతావమ్మా అందుకే రావొద్దు అంటున్నాను అని మురళి అంటాడు. అర్థమైంది నాన్న నేను అక్కడికి వస్తే నేను బాధపడతాను. నన్ను చూసి మీరు బాధపడతారు అందుకే వద్దంటున్నారు సరే మీరే వెళ్లి రండి అని రుక్మిణి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, పండు అన్నం తినకుండా మారం చేసి ఇల్లంతా తిరుగుతూ ఉంటాడు. రేయ్ ఆగరా ఒక్క ముద్ద అన్నం తినరా అని మధురా ధనంజయ్ ఇంట్లో వాళ్ళందరూ పండుని పట్టుకోడానికి ప్రయత్నిస్తారు. కానీ పండు దొరకకుండా పరిగెత్తుతూ ఉంటాడు. ఇంతలో దాక్షాయిని చలపతి వచ్చి పండుని పట్టుకుంటారు. రే నాన్న ఒక్క ముద్ద తినరా అని మధుర అంటుంది. నాకు వద్దు అమ్మ వస్తేనే తింటాను అని పండు అంటాడు. ఇంతలో రాధ శ్యామ్ ఇంటికి వస్తారు.
వచ్చావా రాదా వీడిని అన్నం తినిపించడం నా వల్ల కావట్లేదు నువ్వు లేకపోతే అన్నం తినను అంటున్నాడు అని మధుర అంటుంది. ఏంటి పండు అన్నం ఎందుకు వద్దంటున్నావు అని రాదా అడుగుతుంది. నువ్వు కనిపించకపోతే నాకు అన్నం తిన బుద్ధి కావట్లేదు అని పండు అంటాడు. నేను ఒక రోజంతా కనబడకపోతే ఏం చేస్తావు అని రాదా అడుగుతుంది. ఆరోజు మొత్తం అన్నం తినను అని పండు అంటాడు. వారం రోజులు కనపడకపోతే ఏం చేస్తావు అని రాదా అడుగుతుంది. వారం రోజులు అన్నం తినను అని పండు అంటాడు. నేను అసలే కనిపించకపోతే ఏం చేస్తావురా అని రాదా అడుగుతుంది. అసలే అన్నం తినను అని పండు. పండు అలా అనకూడదు వాళ్లని అంత బాధ పెడతావా అన్నం తిను నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను ఇలా అనడం బాగోలేదు అని రాదా అంటుంది. వాడు అలా అనడమేమో కానీ నువ్వు అలా మాట్లాడడం ఏమీ బాగోలేదు రాదా నువ్వు ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్లి పోతావు అని మధుర అంటుంది.
తనకు ఇంట్లో ఉండడం ఇష్టం లేదేమో అందుకే వెళ్ళిపోతాను అంటుంది అని దాక్షాయిని అంటుంది. తను ఎందుకు వెళ్ళిపోతుంది నువ్వు నోరుముయి అని ధనంజయ్ అంటాడు. నేను అలా అనలేదు అత్తయ్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టడంతొ ఏదో కోపంలో మాట వరసకి అన్నాను అని రాదా అంటుంది. నువ్వు మాట వరసకన్నా ఇలాంటి వాళ్ళకి సందు దొరుకుతుంది ఇంకెప్పుడు అలా అనకు వెళ్లి అందరూ ఫ్రెష్ అప్ అయి రండి డిన్నర్ చేద్దాం అని మధుర అంటుంది. శ్యామ్ అందరికీ బట్టలు ఇస్తాడు. కట్ చేస్తే, మీ అల్లుడు బట్టలు తెచ్చాడు కదా అవి చూడు ఎంత రేటు ఉన్నాయో అని చలపతి అంటాడు. 5000 పెట్టి పట్టుచీర తెచ్చాడండి అని దాక్షాయిని అంటుంది. నావి నీవి కలిపి 7000 అయ్యాయి నేను పది వేలు పెట్టి తెచ్చాను అని చలపతి అంటాడు. సాయంత్రం నుంచి పదివేలు పెట్టి తెచ్చాను అంటున్నారు కానీ చూపించలేదు ఏంటి అని దాక్షాయిని అంటుంది. మీ అల్లుడు బట్టలు తెస్తాడు కదా అవి చూసి తర్వాత వీటిని చూపిద్దామని ఊరుకున్నాను అని చలపతి తెచ్చి ఆ చీరను చూపెడతాడు. అబ్బా ఎంత బాగుందండి ఈ చీర అని దాక్షాయిని అంటుంది. మరి ఏమనుకున్నావు నీ భర్త అంటే 10,000 పెట్టి తెచ్చాను అని చలపతి అంటాడు.
జీవితంలో ఇన్నాళ్ళకి తెచ్చారు 10000 పెట్టి నాకు చీర అని దాక్షాయణి సంతోషపడుతుంది.కట్ చేస్తే,ఇంట్లో అందరూ గుమ్మాలకి పూలు కడుతూ ఉంటారు. రాధా పూజ సామాన్లు శుభ్రం చేస్తూ ఉంటుంది. చలపతి నాకేం పని చెప్పరా అని అడుగుతాడు. పని వాళ్లకు పని చెప్పాలి కానీ ఇంటి వాళ్లకు పని ఎందుకు చెప్పాలి అని ధనంజయ్ అంటాడు. అంటే నేను ఇంటి పనివాన అని చలపతి అడుగుతాడు. అది నీకే తెలవాలి అని ధనంజయ్ వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్న పూలు కింద పడేసి మళ్లీ పూలు సర్దుతూ ఉంటాడు చలపతి. శ్యామ్ గుమ్మానికి పూలు కడుతూ రాదని చూస్తూ ఉంటాడు. అందరూ వెళ్లి రెడీ అయి రండి పని అయిపోయింది పూజ మొదలవుతుంది అని మధుర అంటుంది. అలాగే అని అందరూ వెళ్ళిపోతారు.
రే శ్యామ్ ఏంట్రా రాదను అలా చూస్తున్నావ్ అని మధుర అడుగుతుంది. ఏమీ లేదమ్మా రాదా సాయంత్రం బయటికి వెళ్లాలలి అని0ది ఎక్కడికో చెప్పడం లేదు ఎవరిని కలవడానికి తీసుకు వెళుతుందో ఏమో అని శ్యామ్ అంటాడు. అవునా ఎక్కడికి వెళ్దామనుకున్నా ఉంటుంది రాదా అని మధుర ధనంజయ్ ఆలోచిస్తూ ఉంటారు. కట్ చేస్తే, అమ్మ నాకు ఆఫీస్కి టైం అయింది వెళ్ళొస్తాను మీరు ఫంక్షన్ కి వెళ్ళాలి అన్నారు కదా కలిసి వెళ్దాం రండి అని రుక్మిణి అడుగుతుంది. మాకు కొంచెం లేట్ అవుతుంది అమ్మ నువ్వు వెళ్ళు అని మురళి అంటాడు. చెప్పడం మర్చిపోయా నాన్న నేను మా ఆయన రాధ వాలా ఆయన నలుగురం కలుసుకోబోతున్నాం అని రుక్మిణి అంటుంది.
ఎందుకు అని మురళి అంటాడు. ఏమో నాన్న రాదే కలుద్దామని చెప్పింది అని రుక్మిణి అంటుంది. మేము లేకుండా మీరు ఎలా కలుసుకుంటారమ్మా కుదరదు అని మురళి అంటాడు. అయితే మీరు కూడా రండి నాన్న ఓకే ఫ్రేమ్ లో మా నలుగురిని చూద్దురు అని రుక్మిణి అంటుంది.అదెలా కుదురుతుంది అని మురళి అంటాడు. అదేంటి నాన్న అలా అంటున్నావ్ మా నలుగురిని ఒకే ఫ్రేమ్ లో చూడకూడదా అని రుక్మిణి అంటుంది. మేము ఫంక్షన్ కి వెళ్తున్నాం కదా అమ్మ చూడడం కుదరదు అని మీ నాన్న ఉద్దేశం అని నాగమణి సరిది చెబుతుంది. అవును కదా సరే నాన్న నేను ఆఫీస్ కి వెళ్తున్నాను అని రుక్మిణి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే రాదా వాళ్ళ ఇంట్లో అన్ని పూజకు సిద్ధం చేస్తారు. మురళి నాగమణి రాధ వాళ్ళ ఇంటికి వస్తారు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!